ఎండలు మండిపోతున్నాయ్
- May 29, 2015
వేసవి కాలం కారణంగా ఎండలు మండిపోతున్నాయి.రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదవుతుండడంతో ఎండలో పనిచేసే కార్మికులు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది.సువైక్ విలాయత్లో 47.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది మే 26న. ఉష్ణోగ్రతలు ఇంకా పెరిగే అవకాశముందన్న వాతావరణ శాఖ హెచ్చరికలతో మినిస్ట్రీ ఆఫ్ మ్యాన్ పవర్, కార్మికులకు, వివిధ సంస్థలకు హెచ్చరికలు జారీ చేసింది.మధ్యాహ్నం 12.30 నిమిషాల నుంచి 3.30 నిమిషాల వరకూ పనికి విరామం ఇవ్వాలని మంత్రిత్వ శాఖ సూచించింది.ప్రతి సంవత్సరం ఈ సూచనలు అమల్లో ఉంటాయి.మజ్లిస్ అల్ షురా వైస్ ప్రెసిడెంట్ సలీమ్ అల్ కాబి మాట్లాడుతూ, కార్మికుల్ని మానవత్వంతో చూడాలనీ, వారి విషయంలో నిబంధనల్ని ఖచ్చింతంగా పాటించాల్సి ఉందని వివిధ సంస్థలను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ సెక్రెటరీ జనరల్ డాక్టర్ అబేద్ అల్ షాక్సి, నిబంధనలు ఉల్లంఘించే సంస్థలపై కఠిన చర్యలు ఉంటాయనీ, కార్మికులు రెస్ట్ తీసుకునేందుకు యాజమాన్యాలు ఖచ్చితంగా తగిన చర్యలు తీసుకోవాల్సిందేనని స్పష్టం చేశారు.లేనిపక్షంలో యాజమాన్యాలపై కఠిన చర్యలు తప్పవన్నారు.అయితే ఒకే చోట పనిచేసేవారి విషయంలో సమస్యలుండవనీ, రోడ్లపై పనిచేసేవారితోనే సమస్య వస్తుందనీ, వారికి సౌకర్యాలు కల్పించడం కష్టం అని పేరు చెప్పడానికి ఇష్టపడని ఓ సంస్థ యాజమాన్యం అంటోంది. ప్రపంచ వ్యాప్తంగా గ్లోబల్ వార్మింగ్ కారణంగా వేసవి కాలంలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. భారత్, పాకిస్తాన్లోనూ రికార్డు టెంపరేచర్స్తో జనం బెంబేలెత్తుతున్నారు.
--నూనె లెనిన్ కుమార్(ఒమాన్)
తాజా వార్తలు
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- పర్యావరణ పరిరక్షణలో ఒమన్కు అంతర్జాతీయ గుర్తింపు..!!
- సోషల్ మీడియా బ్యాన్.. క్రియేటర్ ఎకానమీపై ప్రభావంపై యూఏఈ క్లారిటీ..!!
- డొమెస్టిక్ వర్కర్ ను వేధించిన మహిళకు మూడేళ్ల జైలు..!!
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. వినియోగదారుల రక్షణకు 52 మంది అధికారుల నియామకం..!!
- కలర్వర్స్ ఎక్స్పీరియన్స్తో కుటుంబాలకు వినూత్న వినోదం..!!
- జెడ్డాలో భారీగా పట్టుబడ్డ నకిలీ బ్రాండెడ్ దుస్తులు..!!
- కొత్త మల్టిపుల్ ఎంట్రీ వీసాను ప్రవేశపెట్టిన సౌదీ..!!







