ఏ.పిలో కరోనా కేసుల వివరాలు

- February 24, 2021 , by Maagulf
ఏ.పిలో కరోనా కేసుల వివరాలు

అమరావతి:ఏ.పిలో కరోనా పాజిటివ్ కేసులు కొన్ని రోజులుగా 100 కు దిగువగానే వస్తున్నాయి. ఏపీ వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా కరోనా బులెటిన్‌ ప్రకారం..గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 32,434 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 94 కొత్త పాజిటివ్‌ కేసులు నమోదు అయ్యాయి.గడిచిన 24 గంటల్లో ఎలాంటి మరణం సంభవించలేదు.అదే సమయంలో 66 మంది రికవరీ అయ్యారు.దీంతో.. పాజిటివ్‌ కేసుల సంఖ్య 886608 కి చేరగా..కోలుకున్నవారి సంఖ్య 878837 కి చేరింది.ఇక, ఇప్పటి వరకు కరోనాతో 7168 మంది మృతిచెందారు.ప్రస్తుతం రాష్ట్రంలో 603 యాక్టివ్‌ కేసులు ఉన్నట్టు బులెటిన్‌లో పేర్కొంది సర్కార్.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com