మస్కట్:ఆన్ లైన్ మోసాలకు పాల్పడితే జరిమానాతో పాటు 3 ఏళ్ల జైలు శిక్ష

- February 24, 2021 , by Maagulf
మస్కట్:ఆన్ లైన్ మోసాలకు పాల్పడితే జరిమానాతో పాటు 3 ఏళ్ల జైలు శిక్ష

మస్కట్:ఎవరైన వ్యక్తులు ఆన్ లైన్ మోసాలకు పాల్పడితే మూడేళ్ల జైలు శిక్ష, 3,000 రియాల్స్ వరకు జరిమానా చెల్లించాల్సి ఉంటుందని ఒమన్ స్పష్టం చేసింది.ఇంటర్నెట్  వినియోగించిగానీ లేదంటే ఇతర సాంకేతిక మాధ్యమాల ద్వారా ప్రజల నైతికతపై దాడి చేస్తే సహించేంది లేదని పబ్లిక్ ప్రాసిక్యూషన్ హెచ్చరించింది.ఆన్ లైన్ ద్వారా ఉత్పత్తుల పంపిణీ, కొనుగోలు పేరుతో అక్రమాలకు పాల్పడినా..ఒరిజినల్ బ్రాండ్ల లోగోల మాదిరిగానే నకిలీ లోగోలను తయారు చేసి వస్తువులను మార్కెట్ చేసుకోవాలని ప్రయత్నించినా శిక్షార్హులే అవుతారని స్పష్టం చేసింది పబ్లిక్ ప్రాసిక్యూషన్. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com