ప్రైవేట్ ఆస్పత్రుల్లో కోవిడ్ టీకా ధర రూ.250
- February 27, 2021
న్యూ ఢిల్లీ:కోవిడ్-19 వైరస్కు చెక్ పెట్టేందుకు భారత్లో వ్యాక్సినేషన్ కొనసాగుతోంది... ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఉచితంగానే వ్యాక్సిన్ ఇస్తున్నారు.. అయితే, మార్చి 1 నుంచి రెండో విడత కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రారంభం కానుంది.. రెండో విడతలో 60 ఏళ్లు పైబడిన వారికి.. అనారోగ్య సమస్యలతో బాధపడుతోన్న 45 ఏళ్లు పైబడినవారికి కూడా వ్యాక్సిన్ ఇవ్వనున్నారు.. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఉచితంగానే కోవిడ్ టీకాలు వేయనుండగా.. ప్రైవేటు ఆస్పత్రుల్లో వేసుకునే టీకా ధర ఎంత ఉంటుంది? అనే చర్చ సాగుతోంది.. అయితే, ఒక్కడోసుకు 250 రూపాయల వరకు వసూలు చేయవచ్చని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ చెబుతోంది... ప్రైవేట్ ఆస్పత్రులో తీసుకునే టీకా ధర రూ. 250గా నిర్ణయించగా.. దీనికి అదనంగా రూ .100 సర్వీస్ ఛార్జీ ఉంటుందని చెబుతున్నారు.
ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకారం.. ఆయుష్మాన్ భారత్-పిఎంజెఎ పరిధిలో సుమారు 10,000 ఆస్పత్రులు మరియు సిజిహెచ్ఎస్ పరిధిలోని 687 ఆసుపత్రులను సివిసిలుగా రాష్ట్రాలు ఉపయోగించుకోవచ్చు.. రాష్ట్ర ప్రభుత్వ ఆరోగ్య బీమా పథకాలు, అన్ని పిఎస్యుల ఆరోగ్య సౌకర్యాలు, అన్ని ప్రభుత్వ ఆరోగ్య సౌకర్యాలను సివిసిలుగా ఉపయోగించుకునే వీలుతో పాటు.. ప్రైవేట్ ఆసుపత్రులను ఉపయోగించుకునే స్వేచ్ఛ కూడా రాష్ట్రాలకు ఇచ్చింది కేంద్రం.. ఇదిలా ఉంటే.. కరోనా వ్యాక్సినేషన్ తీసుకున్న ఆరోగ్య కార్యకర్తల సంఖ్య దేశంలో 1.37 కోట్లు దాటిందని ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. దేశవ్యాప్తంగా.. 42 రోజుల పాటు.. అంటే శుక్రవారం సాయంత్రం 6 గంటల వరకు మొత్తం 2,84,297 టీకాలను ఇచ్చారు.. అందులో 1,13,208 మంది లబ్ధిదారులకు ఫస్ట్ డోస్ వేయగా, 1,71,089 హెచ్సిడబ్ల్యులకు రెండో డోస్ వ్యాక్సిన్ ఇచ్చినట్టు నివేదికలు చెబుతున్నాయి.
తాజా వార్తలు
- UAE ప్రభుత్వ పాఠశాలల్లో KG నుంచి 2వ తరగతి వరకు హోంవర్క్ రద్దు
- హైదరాబాద్ నగరవాసులకు తీపి కబురు..
- ఇరాన్ చమురు వాణిజ్యంపై భారత్తో సంబంధం ఉన్నకంపెనీల పై ట్రంప్ ఆంక్షలు
- కువైట్లో భద్రతా తనిఖీలు.. 187 మంది అరెస్ట్..!!
- ఔక్ఫ్ అధికారి అవినీతి కేసులో 22 ఏళ్ల జైలు శిక్ష..!!
- ఒమన్లో ఘనంగా ఓనం వేడుకలకు సన్నాహాలు..!!
- 674 పాఠశాలల వద్ద ట్రాఫిక్ భద్రతా చర్యలు పూర్తి..!!
- ఉమ్ అల్ కువైన్ మినీబస్ ప్రమాదంలో భారతీయుడి మృతి.. కేరళకు మృతదేహం తరలింపు..!!
- సౌదీ అరేబియాలో 11.4% తగ్గిన నాన్-ఆయిల్ ఎగుమతులు..!!
- దుబాయ్లో కొత్తగా 26 ప్రైవేట్ విద్యా సంస్థలు.. 17 వేలకుపైగా సీట్లు..!!







