కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఫేస్ రికగ్నైజేషన్ కెమెరాలు
- February 27, 2021
కువైట్ సిటీ:భద్రత ప్రమాణాలను మెరుగుపర్చటంలో భాగంగా కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయంలో అధునాతన కెమెరాలను అమరుస్తున్నట్లు డీజీసీఏ వెల్లడించింది. విమానాశ్రయంలో పాత కెమెరాలను తొలగించి.. మొత్తం 870 సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నామని తెలిపింది. ఇందులో ఫేస్ రికగ్నైజేషన్ కెమెరాలు ఉన్నాయని పేర్కొంది. ఎయిర్ పోర్టులోని అన్ని విభాగాలు, భవనాలతో పాటు టెర్మినల్ 4, టెర్మినల్ 5 బిల్డింగ్ లలో కూడా కెమెరాలను ఏర్పాటు చేస్తున్నట్లు డీజీసీఏ అధికారులు వివరించారు. అలాగే కెమెరా ఫూటేజ్ ను విశ్లేషించేందుకు 20 టీవీ స్క్రీన్లు, 4 బై 2 మీటర్ల వీడియో వాల్ తో అధునాతన కంట్రోల్ రూం సిద్ధమవుతోందన్నారు. ప్రస్తుతం అమరుస్తున్న అధునాతన కెమెరాలు విమానాశ్రయానికి వచ్చే వారి ఫేస్ ను రీడ్ చేసి వారి వివరాలను కంట్రోల్ రూంకి చేరవేస్తాయని..అలాగే పార్కింగ్ ఏరియాలోని కెమెరాలు వాహనాల నెంబర్ ఫ్లేట్లను రీడ్ చేస్తాయని వివరించారు.
తాజా వార్తలు
- దుబాయ్ విమానాశ్రయంలో కీలక మార్పులు.. మరింత సులభంగా రాకపోకలు..!!
- యుద్ధాల కారణంగా ఆకలి.. అంతర్జాతీయ శాంతి, భద్రతకు ముప్పు..!!
- ఎక్స్పో 2030 రియాద్లో అధికారికంగా పాల్గొనే తొలి దేశంగా ఫ్రాన్స్..!!
- ఆసుపత్రిలో ఘోర అగ్నిప్రమాదం..ముగ్గురు పసికందులు సజీవ దహనం
- సలాలా నుంచి నేరుగా జెడ్డా, చటోగ్రామ్, కాలికట్కు సలామ్ఎయిర్ ఫ్లైట్స్..!!
- ఖతార్లో డ్రోన్ల వినియోగంపై అవగాహన..!!
- ఇరాన్ పై కొత్తగా సైనిక దాడులు చేయం..మార్కో రూబియో
- UAE ప్రభుత్వ పాఠశాలల్లో KG నుంచి 2వ తరగతి వరకు హోంవర్క్ రద్దు
- హైదరాబాద్ నగరవాసులకు తీపి కబురు..
- ఇరాన్ చమురు వాణిజ్యంపై భారత్తో సంబంధం ఉన్నకంపెనీల పై ట్రంప్ ఆంక్షలు







