కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఫేస్ రికగ్నైజేషన్ కెమెరాలు
- February 27, 2021
కువైట్ సిటీ:భద్రత ప్రమాణాలను మెరుగుపర్చటంలో భాగంగా కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయంలో అధునాతన కెమెరాలను అమరుస్తున్నట్లు డీజీసీఏ వెల్లడించింది. విమానాశ్రయంలో పాత కెమెరాలను తొలగించి.. మొత్తం 870 సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నామని తెలిపింది. ఇందులో ఫేస్ రికగ్నైజేషన్ కెమెరాలు ఉన్నాయని పేర్కొంది. ఎయిర్ పోర్టులోని అన్ని విభాగాలు, భవనాలతో పాటు టెర్మినల్ 4, టెర్మినల్ 5 బిల్డింగ్ లలో కూడా కెమెరాలను ఏర్పాటు చేస్తున్నట్లు డీజీసీఏ అధికారులు వివరించారు. అలాగే కెమెరా ఫూటేజ్ ను విశ్లేషించేందుకు 20 టీవీ స్క్రీన్లు, 4 బై 2 మీటర్ల వీడియో వాల్ తో అధునాతన కంట్రోల్ రూం సిద్ధమవుతోందన్నారు. ప్రస్తుతం అమరుస్తున్న అధునాతన కెమెరాలు విమానాశ్రయానికి వచ్చే వారి ఫేస్ ను రీడ్ చేసి వారి వివరాలను కంట్రోల్ రూంకి చేరవేస్తాయని..అలాగే పార్కింగ్ ఏరియాలోని కెమెరాలు వాహనాల నెంబర్ ఫ్లేట్లను రీడ్ చేస్తాయని వివరించారు.
తాజా వార్తలు
- ఫేక్ డాక్యుమెంట్లతో సిమ్ తీసుకుంటే జైలే..!!
- నకిలీ ‘కన్స్యూమర్ ప్రొటెక్షన్’ లింక్ల పై దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- కార్వ్ సంస్థకు 4 మిలియన్ డాలర్ల కమిట్మెంట్
- అమరావతిలో మరో ఐకానిక్ నిర్మాణం APNRT టవర్!
- దుబాయ్లో ఎయిర్ ట్యాక్సీలకు గ్రీన్ సిగ్నల్..
- ఖమ్మంలో డీజీపీ సి.వి.ఆనంద్ క్రైమ్ సమీక్ష..'బ్యాక్ టు బేసిక్స్'తో సమర్థ పోలీసింగ్కు పిలుపు
- భారత్ ను చూసి ఇండోనేషియా ఎంతో నేర్చుకోవాలి: ఇండోనేషియా ప్రెసిడెంట్
- పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యం..దక్షిణ కొరియాలో మంత్రి లోకేశ్ బిజీ షెడ్యూల్
- ఖతార్ లో భవిష్యత్ ఉద్యోగ అవసరాలకు అనుగుణంగా స్కాలర్షిప్లు..!!
- ప్యాకేజ్ వీసా.. సౌదీ ప్రయాణం మరింత సులభం..!!







