నిజాయితీ చాటుకున్న నలుగురు డ్రైవర్లు..ప్రశంసించిన ఆర్టీఏ
- February 27, 2021
దుబాయ్:దుబాయ్ లో నలుగురు డ్రైవర్లు తమ నిజాయితీ చాటుకున్నారు.అత్యాశకు పోకుండా ప్రయాణికుడి విలువైన వస్తువులను అతనికి అందించి ఓ డ్రైవర్ నిజాయితీ చాటుకుంటే..మరో ముగ్గురు ఓ మహిళకు సాయం చేసి మంచి మనసును చాటుకున్నారు.దుబాయ్ టాక్సీ కార్పొరేషన్కు చెందిన డ్రైవర్ ఫిరోస్ చారుపాడికల్ టాక్సీలో ఓ ప్రయాణికుడు విలువైన వస్తువులతో ఉన్న బ్యాగును మర్చిపోయాడు. అయితే..ఫిరోస్ ఆ బ్యాగును భద్రంగా ఆ పర్యాటకుడికి అప్పగించి నిజాయితీ చాటుకున్నాడు. మరోచోట ముగ్గురు బస్సు డ్రైవర్లు హసన్ ఖాన్, అజీజ్ రెహ్మాన్, హుస్సేన్ నజీర్...వాహనం చెడిపోయి అవస్థలు పడుతున్న ఓ మహిళకు సాయం చేశారు. తమ టైర్ ను ఆ మహిళ వాహనానికి అమర్చి అమను సురక్షితంగా అక్కడి నుంచి ఇంటికి పంపించారు.ఈ నలుగురు డ్రైవర్ల నిజాయితీ, నైతిక విలువల గురించి తెలుసుకున్న ఆర్టీఏ చైర్మన్ మాత్తార్ మొహమ్మద్ అల్ తేయర్..వారిని ప్రశంసించారు. డ్రైవర్ల అంకితభావానికి కృతజ్ఞతలు తెలిపారు.
తాజా వార్తలు
- ఫేక్ డాక్యుమెంట్లతో సిమ్ తీసుకుంటే జైలే..!!
- నకిలీ ‘కన్స్యూమర్ ప్రొటెక్షన్’ లింక్ల పై దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- కార్వ్ సంస్థకు 4 మిలియన్ డాలర్ల కమిట్మెంట్
- అమరావతిలో మరో ఐకానిక్ నిర్మాణం APNRT టవర్!
- దుబాయ్లో ఎయిర్ ట్యాక్సీలకు గ్రీన్ సిగ్నల్..
- ఖమ్మంలో డీజీపీ సి.వి.ఆనంద్ క్రైమ్ సమీక్ష..'బ్యాక్ టు బేసిక్స్'తో సమర్థ పోలీసింగ్కు పిలుపు
- భారత్ ను చూసి ఇండోనేషియా ఎంతో నేర్చుకోవాలి: ఇండోనేషియా ప్రెసిడెంట్
- పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యం..దక్షిణ కొరియాలో మంత్రి లోకేశ్ బిజీ షెడ్యూల్
- ఖతార్ లో భవిష్యత్ ఉద్యోగ అవసరాలకు అనుగుణంగా స్కాలర్షిప్లు..!!
- ప్యాకేజ్ వీసా.. సౌదీ ప్రయాణం మరింత సులభం..!!







