నిజాయితీ చాటుకున్న నలుగురు డ్రైవర్లు..ప్రశంసించిన ఆర్టీఏ
- February 27, 2021
దుబాయ్:దుబాయ్ లో నలుగురు డ్రైవర్లు తమ నిజాయితీ చాటుకున్నారు.అత్యాశకు పోకుండా ప్రయాణికుడి విలువైన వస్తువులను అతనికి అందించి ఓ డ్రైవర్ నిజాయితీ చాటుకుంటే..మరో ముగ్గురు ఓ మహిళకు సాయం చేసి మంచి మనసును చాటుకున్నారు.దుబాయ్ టాక్సీ కార్పొరేషన్కు చెందిన డ్రైవర్ ఫిరోస్ చారుపాడికల్ టాక్సీలో ఓ ప్రయాణికుడు విలువైన వస్తువులతో ఉన్న బ్యాగును మర్చిపోయాడు. అయితే..ఫిరోస్ ఆ బ్యాగును భద్రంగా ఆ పర్యాటకుడికి అప్పగించి నిజాయితీ చాటుకున్నాడు. మరోచోట ముగ్గురు బస్సు డ్రైవర్లు హసన్ ఖాన్, అజీజ్ రెహ్మాన్, హుస్సేన్ నజీర్...వాహనం చెడిపోయి అవస్థలు పడుతున్న ఓ మహిళకు సాయం చేశారు. తమ టైర్ ను ఆ మహిళ వాహనానికి అమర్చి అమను సురక్షితంగా అక్కడి నుంచి ఇంటికి పంపించారు.ఈ నలుగురు డ్రైవర్ల నిజాయితీ, నైతిక విలువల గురించి తెలుసుకున్న ఆర్టీఏ చైర్మన్ మాత్తార్ మొహమ్మద్ అల్ తేయర్..వారిని ప్రశంసించారు. డ్రైవర్ల అంకితభావానికి కృతజ్ఞతలు తెలిపారు.
తాజా వార్తలు
- భారత్ తొలి బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు..శరవేగంగా సాగుతున్న పనులు
- ఇరాన్పై అమెరికా ఆంక్షల నిర్ణయంపై ఉత్కంఠ..!!
- దుబాయ్ విమానాశ్రయంలో కీలక మార్పులు.. మరింత సులభంగా రాకపోకలు..!!
- యుద్ధాల కారణంగా ఆకలి.. అంతర్జాతీయ శాంతి, భద్రతకు ముప్పు..!!
- ఎక్స్పో 2030 రియాద్లో అధికారికంగా పాల్గొనే తొలి దేశంగా ఫ్రాన్స్..!!
- ఆసుపత్రిలో ఘోర అగ్నిప్రమాదం..ముగ్గురు పసికందులు సజీవ దహనం
- సలాలా నుంచి నేరుగా జెడ్డా, చటోగ్రామ్, కాలికట్కు సలామ్ఎయిర్ ఫ్లైట్స్..!!
- ఖతార్లో డ్రోన్ల వినియోగంపై అవగాహన..!!
- ఇరాన్ పై కొత్తగా సైనిక దాడులు చేయం..మార్కో రూబియో
- UAE ప్రభుత్వ పాఠశాలల్లో KG నుంచి 2వ తరగతి వరకు హోంవర్క్ రద్దు







