నిజాయితీ చాటుకున్న నలుగురు డ్రైవర్లు..ప్రశంసించిన ఆర్టీఏ
- February 27, 2021
దుబాయ్:దుబాయ్ లో నలుగురు డ్రైవర్లు తమ నిజాయితీ చాటుకున్నారు.అత్యాశకు పోకుండా ప్రయాణికుడి విలువైన వస్తువులను అతనికి అందించి ఓ డ్రైవర్ నిజాయితీ చాటుకుంటే..మరో ముగ్గురు ఓ మహిళకు సాయం చేసి మంచి మనసును చాటుకున్నారు.దుబాయ్ టాక్సీ కార్పొరేషన్కు చెందిన డ్రైవర్ ఫిరోస్ చారుపాడికల్ టాక్సీలో ఓ ప్రయాణికుడు విలువైన వస్తువులతో ఉన్న బ్యాగును మర్చిపోయాడు. అయితే..ఫిరోస్ ఆ బ్యాగును భద్రంగా ఆ పర్యాటకుడికి అప్పగించి నిజాయితీ చాటుకున్నాడు. మరోచోట ముగ్గురు బస్సు డ్రైవర్లు హసన్ ఖాన్, అజీజ్ రెహ్మాన్, హుస్సేన్ నజీర్...వాహనం చెడిపోయి అవస్థలు పడుతున్న ఓ మహిళకు సాయం చేశారు. తమ టైర్ ను ఆ మహిళ వాహనానికి అమర్చి అమను సురక్షితంగా అక్కడి నుంచి ఇంటికి పంపించారు.ఈ నలుగురు డ్రైవర్ల నిజాయితీ, నైతిక విలువల గురించి తెలుసుకున్న ఆర్టీఏ చైర్మన్ మాత్తార్ మొహమ్మద్ అల్ తేయర్..వారిని ప్రశంసించారు. డ్రైవర్ల అంకితభావానికి కృతజ్ఞతలు తెలిపారు.
తాజా వార్తలు
- ఏపీ బడ్జెట్ 2026-27: దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణం
- అంతర్జాతీయ మాదకద్రవ్య ముఠాను ఛేదించిన యూఏఈ, కువైట్..!!
- కువైట్ ఎంబసీలో నేషనల్, లిబరేషన్ డే సెలబ్రేషన్స్..!!
- GCC లో పనిచేసే బహ్రెయిన్లకు నిరుద్యోగ బీమా..!!
- ఖసాబ్ లో భూకంపం వివరాలు వెల్లడి..!!
- ఖతార్ లో రెండు రోజులపాటు స్ట్రాంగ్ విండ్స్..!!
- గాజా సంక్షోభం .. గ్లోబల్ వైఫల్యం: సౌదీ FM
- తెలంగాణ: మున్సిపల్ ఎన్నికల ఫలితాలు..
- మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ హవా...మెజారిటీ స్థానాలు కైవసం
- కెనడా పై యూఏఈ విజయం









