కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఫేస్ రికగ్నైజేషన్ కెమెరాలు
- February 27, 2021
కువైట్ సిటీ:భద్రత ప్రమాణాలను మెరుగుపర్చటంలో భాగంగా కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయంలో అధునాతన కెమెరాలను అమరుస్తున్నట్లు డీజీసీఏ వెల్లడించింది. విమానాశ్రయంలో పాత కెమెరాలను తొలగించి.. మొత్తం 870 సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నామని తెలిపింది. ఇందులో ఫేస్ రికగ్నైజేషన్ కెమెరాలు ఉన్నాయని పేర్కొంది. ఎయిర్ పోర్టులోని అన్ని విభాగాలు, భవనాలతో పాటు టెర్మినల్ 4, టెర్మినల్ 5 బిల్డింగ్ లలో కూడా కెమెరాలను ఏర్పాటు చేస్తున్నట్లు డీజీసీఏ అధికారులు వివరించారు. అలాగే కెమెరా ఫూటేజ్ ను విశ్లేషించేందుకు 20 టీవీ స్క్రీన్లు, 4 బై 2 మీటర్ల వీడియో వాల్ తో అధునాతన కంట్రోల్ రూం సిద్ధమవుతోందన్నారు. ప్రస్తుతం అమరుస్తున్న అధునాతన కెమెరాలు విమానాశ్రయానికి వచ్చే వారి ఫేస్ ను రీడ్ చేసి వారి వివరాలను కంట్రోల్ రూంకి చేరవేస్తాయని..అలాగే పార్కింగ్ ఏరియాలోని కెమెరాలు వాహనాల నెంబర్ ఫ్లేట్లను రీడ్ చేస్తాయని వివరించారు.
తాజా వార్తలు
- లులు గ్రూప్ తిరిగి విజాగ్లో మాల్ ప్రాజెక్ట్ ప్రారంభం, ఏపీ ప్రభుత్వంతో MoU
- జగన్కు చెందిన ఆస్తులపై స్టే కొనసాగాలి
- టీటీడీకి రూ.కోటి విరాళం
- ప్రభుత్వాస్పత్రిలో దారుణం..ఇంజక్షన్ వికటించి 17 మంది చిన్నారులకు అస్వస్థత
- హైదరాబాద్–విజయవాడ హైవే పై 60 అండర్పాస్లు
- నితీశ్ రాజకీయాల్లో అరుదైన రికార్డు
- ఎల్బీ స్టేడియంలో అరైవ్ అలైవ్ లాంచ్
- CII సదస్సు తొలిరోజు రికార్డ్ స్థాయిలో పెట్టుబడులు
- ఖతార్ లో ఉపాధ్యాయులకు సామర్థ్య పరీక్షలు..!!
- కువైట్ లో పొగమంచు, రెయిన్ అలెర్ట్ జారీ..!!







