వ్యాక్సిన్ తీసుకునేందుకు వెనుకాడవద్దు- టి.గవర్నర్
- March 02, 2021పుదుచ్చేరి:కరోనా వ్యాక్సిన్ తీసుకోవడంలో ప్రజలు వెనుకాడవద్దని తెలంగాణ గవర్నర్, పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అన్నారు.దేశ వ్యాప్తంగామూడోదశ వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభమైన నేపధ్యంలో సోమవారం పాండిచ్చేరి నుంచి తెలంగాణ పరిస్థితులపై ఆమె వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు.ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ వ్యాక్సిన్ తీసుకునేందుకు అర్హులైన 60సంవత్సరాలు పై బడిన వారు, వివిధ రకాల రుగ్మతలను కలిగి ఉన్న 45 సంవత్సరాలుపై బడిన వారు తప్పని సరిగా కోవిడ్ వ్యాక్సిన్కోసం తమ పేర్లను నమోదు చేసుకోవాలని అన్నారు.
రాజ్భవన్లోనూ అర్హులైన వారిని గుర్తించి వారు త్వరగా వ్యాక్సిన్ తీసుకునేందుకు రాజ్భవన్ అధికారులు కృషి చేయాలని సూచించారు.రాజ్భవన్లో అర్భులైన వారు వ్యాక్సిన్ తీసుకుని ఇతరులకు రోల్మోడల్గా నిలవాలని అన్నారు.సాధారణ ప్రజలు కూడా కోవిడ్ వ్యాప్తిచెందకుండా నిబంధనలను ఖచ్చితంగా పాటించాలని గవర్నర్ సూచించారు.ప్రజల్లో వ్యాక్సిన్పై అవగాహన కల్పించేందుకు సోషల్ మీడియా కూడా తమ వంతు కృషి చేయాలని అన్నారు.
తాజా వార్తలు
- వాట్సాప్ లో కొత్త ఫీచర్.. ఇంటర్నెట్ లేకున్నా ఫోటోలు పంపించొచ్చు!
- కంటి శస్త్ర చికిత్స పరికరమును విరాళంగా ఇచ్చిన మజ్గూన్ డాక్ యార్డ్
- నూడుల్స్లో కోట్ల విలువైన వజ్రాలు..
- పిఠాపురం ఎమ్మెల్యే అభ్యర్థిగా పవన్ కల్యాణ్ నామినేషన్
- గాజాలో తక్షణ కాల్పుల విరమణకు GCC, EU ఉమ్మడి చర్యలు. !
- బ్యాంకులు రుణ వాయిదాలు 6 నెలల పాటు వాయిదా..!
- 3 నెలల్లో 67 హాస్పిటాలిటీ సౌకర్యాలు మూసివేత
- జిలీబ్ అల్-షుయౌఖ్లో ఆసియా జాతీయుడి హత్య..!
- యూఏఈ అధ్యక్షుడితో సుల్తాన్ కీలక చర్చలు
- విమానాల్లో 12 ఏళ్లలోపు చిన్నారులకు వారి పేరెంట్స్ పక్కనే సీటు ఇవ్వాలి: DGCA