కోవిడ్ ఎఫెక్ట్: భారత రాయబార కార్యాలయం మూసివేత
- March 02, 2021కువైట్ సిటీ:కోవిడ్ కేసుల సంఖ్య రోజు రోజుకీ పెరుగుతుండటంతో కువైట్లోని భారత రాయబార కార్యాలయం ముందు జాగ్రత్త చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా ఇవాళ్టి నుంచి ఈ నెల 4 వరకు రాయబార కార్యాలయంలో ప్రత్యక్ష సేవలను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. అయితే..అత్యవసర సేవలను మాత్రం కొనసాగించనున్నారు. అత్యవసర సేవలు పొందేందుకు ముందుగా అపాయింట్మెంట్ తీసుకోవాలి. ఎంబసీ నుంచి ఎవరైన ఎమర్జెన్సీ సేవలు పొందెందుకు [email protected] ద్వారా తమను సంప్రదించాలని అధికారులు వెల్లడించారు. పాస్ పోర్టు సేవలు మాత్రం యాధావిధిగా కొనసాగుతాయని.. ఇందుకోసం కువైట్లోని మూడు పాస్ పోర్టు కేంద్రాలను సంప్రదించవచ్చని తెలిపారు. ఇదిలాఉంటే మార్చి నెలకు సంబంధించి ఎంబసీ కార్యాలయం షెడ్యూల్ చేసిన అన్ని ఈవెంట్లను వాయిదా వేశామని కూడా అధికారులు వివరించారు.
--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి, కువైట్)
తాజా వార్తలు
- ఫ్లైదుబాయ్ విమాన సర్వీసులు రీషెడ్యూల్
- రోడ్లపై వరదనీరు.. కొనసాగుతున్న ట్రాఫిక్ ఆంక్షలు
- యూఏఈకి భారీ రెయిన్ అలెర్ట్
- ఉమ్రా వీసా వ్యవధిపై సౌదీ కీలక ఉత్తర్వులు
- ఇరాన్పై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన ఒమన్
- కార్మికులకు కువైట్ శుభవార్త..!
- ఐదు రోజులపాటు తెలంగాణకు వర్ష సూచన
- ఇరాన్ పై ప్రతీకార దాడులకు దిగిన ఇజ్రాయెల్
- కొనసాగుతున్న లోక్సభ ఎన్నికల తొలిదశ పోలింగ్
- ఓటర్లు పెద్ద సంఖ్యలో తమ ఓటు హక్కు వినియోగించుకోవాలి: ప్రధాని మోడీ