కోవిడ్ ఎఫెక్ట్: భారత రాయబార కార్యాలయం మూసివేత
- March 02, 2021
కువైట్ సిటీ:కోవిడ్ కేసుల సంఖ్య రోజు రోజుకీ పెరుగుతుండటంతో కువైట్లోని భారత రాయబార కార్యాలయం ముందు జాగ్రత్త చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా ఇవాళ్టి నుంచి ఈ నెల 4 వరకు రాయబార కార్యాలయంలో ప్రత్యక్ష సేవలను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. అయితే..అత్యవసర సేవలను మాత్రం కొనసాగించనున్నారు. అత్యవసర సేవలు పొందేందుకు ముందుగా అపాయింట్మెంట్ తీసుకోవాలి. ఎంబసీ నుంచి ఎవరైన ఎమర్జెన్సీ సేవలు పొందెందుకు [email protected] ద్వారా తమను సంప్రదించాలని అధికారులు వెల్లడించారు. పాస్ పోర్టు సేవలు మాత్రం యాధావిధిగా కొనసాగుతాయని.. ఇందుకోసం కువైట్లోని మూడు పాస్ పోర్టు కేంద్రాలను సంప్రదించవచ్చని తెలిపారు. ఇదిలాఉంటే మార్చి నెలకు సంబంధించి ఎంబసీ కార్యాలయం షెడ్యూల్ చేసిన అన్ని ఈవెంట్లను వాయిదా వేశామని కూడా అధికారులు వివరించారు.
--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి, కువైట్)
తాజా వార్తలు
- లోక్సభ స్పీకర్ పై అవిశ్వాస తీర్మాణానికి కాంగ్రెస్ సిద్ధం
- మున్సిపల్ ఎన్నికలకు సర్వం సిద్ధం: డీజీపీ శివధర్ రెడ్డి
- విశాఖ మెట్రోకు గ్రీన్ సిగ్నల్
- టీటీడీకి రూ.30 లక్షలు విరాళం
- సీషెల్స్ దేశానికి ప్రధాని మోదీ $175 మిలియన్ల ఆర్థిక ప్యాకేజీ
- యూపీఐ ద్వారా పీఎఫ్..
- IAF Jobs 2026: వాయుసేనలో అగ్నివీర్ ఉద్యోగాలు
- షార్లెట్లో ఘనంగా NATS చదరంగం పోటీలు
- హైదరాబాద్లో ఏర్పాటు కానున్న అమెరికా దిగ్గజం కాస్ట్కో
- భారత్ లో వాటర్ మెట్రోలు ఏర్పాటుకు కేంద్రం భారీ ప్లాన్!









