పుట్టిన రోజు సందర్భంగా అనాథ పిల్లలతో గడిపిన టి.హోం మంత్రి

- March 02, 2021 , by Maagulf
పుట్టిన రోజు సందర్భంగా అనాథ పిల్లలతో గడిపిన టి.హోం మంత్రి

హైదరాబాద్:తెలంగాణ రాష్ట్ర హోంమంత్రి ముహమ్మద్ మహమూద్ అలీ తన పుట్టినరోజు సందర్భంగా అంబర్‌పేటలోని అంజుమన్ ఖాడిముల్ ముస్లి మీన్ లోని అనాథలతో గడిపారు.  ఈ సందర్భంగా అమాయక అనాథలతో గడపడం సంతోషంగా ఉందని హోం మంత్రి  అన్నారు.పిల్లలతో మాట్లాడుతూ, వారి దినచర్యల గురించి తెలుసుకుని, వారు కష్టపడి చదువుకోవాలని, ఉన్నత విద్య కోసం కృషి చేయాలని అని ఉద్బోధించారు.విద్యార్తులు తమ  సందేహాలను  ఉపాధ్యాయుల నుండి తెలుసుకొని నివృత్తి చేసుకోవాలని సూచించారు. 

విద్యార్థులు ఈ సందర్బంగా హోంమంత్రికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.అంజుమన్ ఖదిముల్ ముస్లిమీన్ కార్యకర్త  బద్రుద్దీన్  హోంమంత్రికి సంస్థ పనితీరు మరియు విద్యార్థుల గురించి వివరించారు.కార్యక్రమంలో బద్రుద్దీన్ మాట్లాడుతూ  విద్యార్థులు చాలా తెలివైనవారు, కష్టపడి పనిచేసేవారు మరియు మర్యాదపూర్వకంగా ఉంటారని,పరీక్షలు మరియు పోటీలలో బాగా రాణిస్తున్నారని తెలిపారు.సంస్థ విద్యార్థులకు వారి భవిష్యత్తు ఉజ్వలంగా ఉండటానికి ప్రభుత్వ సహకారాన్ని కొనసాగించాలని ఆయన హోంమంత్రి ముహమ్మద్ మహమూద్ అలీని అభ్యర్థించారు.దీనికి స్పందించిన హోం శాఖ మంత్రి తన వంతు సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని హామీ ఇచ్చారు.    

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com