మార్చి 4 నుంచి తెరుచుకోనున్న మసీదులు
- March 02, 2021
బహ్రెయిన్:ఫజ్ర్, ధుర్, అస్ర్ సందర్భంగా ప్రార్థనల కోసం మార్చి 4 నుంచి మసీదు ద్వారాలు తేరుచుకోనున్నాయి. బుధవారం నుంచి ప్రార్థనలు ప్రారంభమవుతాయని ఇస్లామిక్ అఫైర్స్ మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది.కోవిడ్ వ్యాప్తి నియంత్రణ కోసం ఏర్పాటైన సుప్రీం కౌన్సిల్, నేషనల్ మెడికల్ టాస్క్ ఫోర్స్ సంబంధిత మత పెద్దలతో సంప్రదించి మసీదులలో ప్రార్థనలకు అనుమతి తెలిపింది. సుప్రీం కౌన్సిల్ నిర్ణయానికి అనుగుణంగా బుధవారం నుంచి మసీదులు తెరుచుకునేందుకు అనుమతి ఇచ్చినట్లు ఇస్లామిక్ అఫైర్స్ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. అయితే..కరోనా నేపథ్యంలో భక్తులు అందరూ తప్పనిసరిగా ముందస్తు జాగ్రత్తలను పాటించాలని మంత్రిత్వ శాఖ అధికారులు వెల్లడించారు.
తాజా వార్తలు
- ICC T20 World Cup 2026: ఇంగ్లండ్ పై వెస్టిండీస్ విజయం
- నాలుగో అత్యంత విలువైన సంస్థగా SBI
- కెనడా స్కూల్లో కాల్పులు..10 మంది మృతి
- BHELలో 5 శాతం వాటాల విక్రయం..
- పీపుల్స్ పల్స్ ఎగ్జిట్ పోల్: మునిసిపల్ ఎన్నికల్లో ఆ పార్టీ దే హవా!
- తెలంగాణ: మున్సిపల్ పోలింగ్ ముగిసింది
- సామాజిక రక్షణ పథకాల కవరేజ్ గురించి లోక్ సభలో ప్రశ్నించిన ఎంపి బాలశౌరి
- అమెరికా ప్రభుత్వానికి భారత్ తలొగ్గింది..రాహుల్గాంధీ
- రేపు భారత్ బంద్..
- ఆంధ్రప్రదేశ్: మార్చి 6 వరకు అసెంబ్లీ సమావేశాలు









