మార్చి 4 నుంచి తెరుచుకోనున్న మసీదులు

- March 02, 2021 , by Maagulf
మార్చి 4 నుంచి తెరుచుకోనున్న మసీదులు

బహ్రెయిన్:ఫజ్ర్, ధుర్, అస్ర్ సందర్భంగా ప్రార్థనల కోసం మార్చి 4 నుంచి మసీదు ద్వారాలు తేరుచుకోనున్నాయి. బుధవారం నుంచి ప్రార్థనలు ప్రారంభమవుతాయని ఇస్లామిక్ అఫైర్స్ మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది.కోవిడ్ వ్యాప్తి నియంత్రణ కోసం ఏర్పాటైన సుప్రీం కౌన్సిల్, నేషనల్ మెడికల్ టాస్క్ ఫోర్స్ సంబంధిత మత పెద్దలతో సంప్రదించి మసీదులలో ప్రార్థనలకు అనుమతి తెలిపింది. సుప్రీం కౌన్సిల్ నిర్ణయానికి అనుగుణంగా బుధవారం నుంచి మసీదులు తెరుచుకునేందుకు అనుమతి ఇచ్చినట్లు ఇస్లామిక్ అఫైర్స్ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. అయితే..కరోనా నేపథ్యంలో భక్తులు అందరూ తప్పనిసరిగా ముందస్తు జాగ్రత్తలను పాటించాలని మంత్రిత్వ శాఖ అధికారులు వెల్లడించారు. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com