క్వారంటైన్ నిబంధన నుంచి 5 వర్గాలకు మినహాయింపు
- March 02, 2021కువైట్ సిటీ:కువైట్ చేరుకునే అంతర్జాతీయ ప్రయాణికులు అందరూ ఖచ్చితంగా క్వారంటైన్ లో ఉండాలని కండీషన్ విధించిన కువైట్..కొన్ని వర్గాలకు మాత్రం క్వారంటైన్ నిబంధనల నుంచి మినహాయింపు ఇచ్చింది. మొత్తం ఐదు కేటగిరిలకు చెందిన వ్యక్తులు విదేశాల నుంచి వచ్చినా క్వారంటైన్ లో ఉండాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది.కువైట్ డీజీసీఏ తెలిపిన వివరాల మేరకు విదేశాల నుంచి వచ్చే దౌత్య వేతలు, దౌత్య కార్యాలయ సిబ్బంది, వారి కుటుంబ సభ్యులు క్వారంటైన్ లో ఉండాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. అలాగే విదేశాలల్లో చికిత్స పొంది సొంత దేశానికి తిరిగి వచ్చే కువైట్ పౌరులు, చదువ కోసం విదేశాలకు వెళ్లి తిరిగి వచ్చే కువైట్ విద్యార్ధులు, ప్రభుత్వ, ప్రైవేట్ ఆరోగ్య కేంద్రాల్లో విధులు నిర్వహించే వైద్య సిబ్బంది వారి రక్త సంబంధీకులు క్వారంటైన్ నిబంధనను పాటించాల్సిన అవసరం లేదు. అయితే..వైద్య సిబ్బంది తమ రక్త సంబంధికుల వివరాలను రుజువు చేసేలా తగిన డాక్యుమెంట్లను సమర్పించాల్సి ఉంటుంది.ఐదో కేటగిరిలో భాగంగా 18 ఏళ్లలోపు వారిని క్వారంటైన్ నిబంధన నుంచి మినహాయింపు ఇచ్చింది కువైట్.
తాజా వార్తలు
- ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై నీతి ఆయోగ్ సంచలన ప్రకటన
- హైదరాబాద్లో అనేక ప్రాంతాల్లో భారీ వర్షం
- CBSE పాఠశాలలు ఓపెన్-బుక్ పరీక్షలను నిర్వహిస్తాయా?
- స్లోవాక్ ప్రధానిపై హత్యాయత్నం.. తీవ్రంగా ఖండించిన ఖతార్
- వీసా కోసం లంచం...ఉద్యోగికి 4 ఏళ్ల జైలుశిక్ష
- గాజా భవిష్యత్తు. నెతన్యాహుపై క్యాబినెట్ అసంతృప్తి..!
- ఒమన్ ఎయిర్ వింటర్ షెడ్యూల్ పొడిగింపు
- ఏపీలో సంక్షేమ పథకాల అమలుకు నిధులు విడుదల
- ఉద్యోగులకు ఎమిరేట్స్ బోనస్. ప్రైవేట్ కంపెనీలు అనుసరిస్తాయా?
- ఏపీ ఎన్నికల ఫలితాలపై రూ.కోట్లలో బెట్టింగ్లు