ప్రభుత్వ రంగం నుంచి ప్రైవేట్ సెక్టార్ కి వలస కార్మికుల బదిలీ
- March 04, 2021
కువైట్ సిటీ:కోవిడ్ సమయంలో కార్మిక శక్తి లోటును భర్తీ చేసేందుకు మానవ వనరుల మంత్రిత్వ శాఖ తన విశిష్ట అధికారాలను వినియోగించుకుంటోంది. ప్రభుత్వ రంగంలో సేవలు అందిస్తున్న ప్రవాసీ ఉద్యోగులు/కార్మికులను ప్రైవేట్ రంగానికి బదిలీ చేసేందుకు అనుమతులు ఇస్తూ ఆదేశాలు జారీ చేసింది. మంత్రిత్వ శాఖలు, ప్రభుత్వ సంస్థల్లో విధులు నిర్వహిస్తున్నవారు అలాగే ఫ్యామిలీ వీసాలు కలిగిన వారిని ప్రైవేట్ రంగంలోకి బదిలీ చేసుకోవచ్చని స్పష్టం చేసింది. ఇక కోవిడ్ వ్యాప్తి నియంత్రణ చర్యలు, కోవిడ్ సంక్షోభం కారణంగా సేవలు నిలిచిపోయిన, నిషేధించిన రంగాల్లోని కార్మిక శక్తిని ఇతర రంగాల్లో వినియోగించుకోవాలని కూడా ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. పారిశ్రామిక రంగంతో పాటు వ్యవసాయం, పాడి పశువుల పెంపకం, ఫిషింగ్, సహాకార సంఘాలు, ఫ్రీ ట్రేడ్ జోన్లోని ఉపాధి రంగాలను గుర్తించి నిషేధించబడిన రంగాల్లోని కార్మిక శక్తిని బదిలీ చేయవచ్చని స్పష్టం చేసింది. అలాగే అడ్మినిస్ట్రేషన్ డెసిషన్ నెం. 842లోని ఆర్టికల్-5లోని క్లాజ్ నెంబర్ 1 మేరకు అవసరం అనుకుంటే యజమానుల అనుమతితో స్థానిక కార్మిక శక్తిని వెంటనే ఇతర రంగాలకు బదిలీ చేసుకునే వెసులుబాటు కూడా కల్పించింది. అయితే ఈ నిబంధన ప్రభుత్వ కాంట్రాక్ట్ ఉద్యోగులు, చిన్న, మధ్యతరహా పరిశ్రమల కార్మిక శక్తి బదలాయింపునకు వర్తించదని వెల్లడించింది.
తాజా వార్తలు
- ఫేక్ డాక్యుమెంట్లతో సిమ్ తీసుకుంటే జైలే..!!
- నకిలీ ‘కన్స్యూమర్ ప్రొటెక్షన్’ లింక్ల పై దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- కార్వ్ సంస్థకు 4 మిలియన్ డాలర్ల కమిట్మెంట్
- అమరావతిలో మరో ఐకానిక్ నిర్మాణం APNRT టవర్!
- దుబాయ్లో ఎయిర్ ట్యాక్సీలకు గ్రీన్ సిగ్నల్..
- ఖమ్మంలో డీజీపీ సి.వి.ఆనంద్ క్రైమ్ సమీక్ష..'బ్యాక్ టు బేసిక్స్'తో సమర్థ పోలీసింగ్కు పిలుపు
- భారత్ ను చూసి ఇండోనేషియా ఎంతో నేర్చుకోవాలి: ఇండోనేషియా ప్రెసిడెంట్
- పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యం..దక్షిణ కొరియాలో మంత్రి లోకేశ్ బిజీ షెడ్యూల్
- ఖతార్ లో భవిష్యత్ ఉద్యోగ అవసరాలకు అనుగుణంగా స్కాలర్షిప్లు..!!
- ప్యాకేజ్ వీసా.. సౌదీ ప్రయాణం మరింత సులభం..!!







