యూఏఈ:కోవిడ్ రూల్స్ బ్రేక్..క్రికెట్ ఆడుతున్న 13 మందికి ఫైన్
- March 04, 2021
యూఏఈ:ఓ వైపు సెకండ్ వేవ్ ముప్పు ముంచుకొస్తుండటంతో ప్రభుత్వం ఆంక్షలను మళ్లీ కఠినతరం చేస్తుంటే..కొందరు యువతకు మాత్రం అవేం పట్టడం లేదు. బహిరంగ ప్రాంతాల్లో ఐదుగురికి మించి ఎక్కువ మంది ఒకే దగ్గర పోగవ్వొద్దని సూచించిన ఆరోగ్య శాఖ..సమాజ ఆరోగ్య సంరక్షణ కోసం అన్ని స్పోర్ట్స్ ఈవెంట్లను రద్దు చేసిన విషయం తెలిసిందే. అయితే..షార్జాలో కొందరు యువకులు ఆరోగ్య శాఖ సూచనలను, కోవిడ్ నిబంధనలను పట్టించుకోకుండా క్రికెట్ ఆడుతూ బుక్కైపోయారు. అనుమతి లేని ప్రాంతంలో కోవిడ్ నిబంధనలను ఉల్లంఘిస్తూ క్రికెట్ ఆడుతూ పాట్రోలింగ్ చేస్తున్న పోలీసులకు పట్టుబడినట్లు అధికారులు వెల్లడించారు. నిబంధనలు ఉల్లంఘించిన 13 మందికి ఫైన్ విధించినట్లు వెల్లడించారు. కోవిడ్ నిబంధనలను పకడ్బందీగా అమలు చేయటం తమ బాధ్యతని..నిరంతరం పాట్రోలింగ్ బృందాల నిఘా కొనసాగుతుందనే విషయాన్ని ప్రజలు గుర్తుంచుకోవాలని పోలీసులు హెచ్చరించారు.
తాజా వార్తలు
- ఫేక్ డాక్యుమెంట్లతో సిమ్ తీసుకుంటే జైలే..!!
- నకిలీ ‘కన్స్యూమర్ ప్రొటెక్షన్’ లింక్ల పై దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- కార్వ్ సంస్థకు 4 మిలియన్ డాలర్ల కమిట్మెంట్
- అమరావతిలో మరో ఐకానిక్ నిర్మాణం APNRT టవర్!
- దుబాయ్లో ఎయిర్ ట్యాక్సీలకు గ్రీన్ సిగ్నల్..
- ఖమ్మంలో డీజీపీ సి.వి.ఆనంద్ క్రైమ్ సమీక్ష..'బ్యాక్ టు బేసిక్స్'తో సమర్థ పోలీసింగ్కు పిలుపు
- భారత్ ను చూసి ఇండోనేషియా ఎంతో నేర్చుకోవాలి: ఇండోనేషియా ప్రెసిడెంట్
- పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యం..దక్షిణ కొరియాలో మంత్రి లోకేశ్ బిజీ షెడ్యూల్
- ఖతార్ లో భవిష్యత్ ఉద్యోగ అవసరాలకు అనుగుణంగా స్కాలర్షిప్లు..!!
- ప్యాకేజ్ వీసా.. సౌదీ ప్రయాణం మరింత సులభం..!!







