యూఏఈ:కోవిడ్ రూల్స్ బ్రేక్..క్రికెట్ ఆడుతున్న 13 మందికి ఫైన్
- March 04, 2021
యూఏఈ:ఓ వైపు సెకండ్ వేవ్ ముప్పు ముంచుకొస్తుండటంతో ప్రభుత్వం ఆంక్షలను మళ్లీ కఠినతరం చేస్తుంటే..కొందరు యువతకు మాత్రం అవేం పట్టడం లేదు. బహిరంగ ప్రాంతాల్లో ఐదుగురికి మించి ఎక్కువ మంది ఒకే దగ్గర పోగవ్వొద్దని సూచించిన ఆరోగ్య శాఖ..సమాజ ఆరోగ్య సంరక్షణ కోసం అన్ని స్పోర్ట్స్ ఈవెంట్లను రద్దు చేసిన విషయం తెలిసిందే. అయితే..షార్జాలో కొందరు యువకులు ఆరోగ్య శాఖ సూచనలను, కోవిడ్ నిబంధనలను పట్టించుకోకుండా క్రికెట్ ఆడుతూ బుక్కైపోయారు. అనుమతి లేని ప్రాంతంలో కోవిడ్ నిబంధనలను ఉల్లంఘిస్తూ క్రికెట్ ఆడుతూ పాట్రోలింగ్ చేస్తున్న పోలీసులకు పట్టుబడినట్లు అధికారులు వెల్లడించారు. నిబంధనలు ఉల్లంఘించిన 13 మందికి ఫైన్ విధించినట్లు వెల్లడించారు. కోవిడ్ నిబంధనలను పకడ్బందీగా అమలు చేయటం తమ బాధ్యతని..నిరంతరం పాట్రోలింగ్ బృందాల నిఘా కొనసాగుతుందనే విషయాన్ని ప్రజలు గుర్తుంచుకోవాలని పోలీసులు హెచ్చరించారు.
తాజా వార్తలు
- హనీట్రాప్ కేసులో సంచలనం: 9 మంది పోలీసులపై కఠిన చర్యలు
- ఏపీ రాష్ట్రానికి 750 ఎలక్ట్రిక్ బస్సులు
- తెలంగాణలో యువతకు శిక్షణ.. అనంతరం జపాన్, జర్మనీలో ఉద్యోగాలు
- ఏపీ ప్రజలకు బంపర్ ఆఫర్ ప్రకటించిన ఏపీ ప్రభుత్వం
- ప్రతీ పల్లెకు ఆర్టీసీ బస్సు: రేవంత్ ప్రభుత్వం శుభవార్త
- దుబాయ్ స్కూళ్లలో పీఈ క్లాసులకు ఆమోదం..!!
- సౌదీలో 500కు పైగా హెరిటేజ్ ప్రదేశాల్లో పునరుజ్జీవ కార్యక్రమాలు..!!
- బహ్రెయిన్ లో స్కూల్ అడ్మిషన్లు ప్రారంభం..!!
- షార్జాలో Dh3 మిలియన్ ఫ్రాడ్..క్రిమినల్ నెట్వర్క్ అరెస్టు..!!
- కువైట్కు సంఘీభావంగా బెంగాలీ సొసైటీ..క్రాఫ్ట్ వర్క్షాప్..!!









