యూఏఈ:కోవిడ్ రూల్స్ బ్రేక్..క్రికెట్ ఆడుతున్న 13 మందికి ఫైన్
- March 04, 2021
యూఏఈ:ఓ వైపు సెకండ్ వేవ్ ముప్పు ముంచుకొస్తుండటంతో ప్రభుత్వం ఆంక్షలను మళ్లీ కఠినతరం చేస్తుంటే..కొందరు యువతకు మాత్రం అవేం పట్టడం లేదు. బహిరంగ ప్రాంతాల్లో ఐదుగురికి మించి ఎక్కువ మంది ఒకే దగ్గర పోగవ్వొద్దని సూచించిన ఆరోగ్య శాఖ..సమాజ ఆరోగ్య సంరక్షణ కోసం అన్ని స్పోర్ట్స్ ఈవెంట్లను రద్దు చేసిన విషయం తెలిసిందే. అయితే..షార్జాలో కొందరు యువకులు ఆరోగ్య శాఖ సూచనలను, కోవిడ్ నిబంధనలను పట్టించుకోకుండా క్రికెట్ ఆడుతూ బుక్కైపోయారు. అనుమతి లేని ప్రాంతంలో కోవిడ్ నిబంధనలను ఉల్లంఘిస్తూ క్రికెట్ ఆడుతూ పాట్రోలింగ్ చేస్తున్న పోలీసులకు పట్టుబడినట్లు అధికారులు వెల్లడించారు. నిబంధనలు ఉల్లంఘించిన 13 మందికి ఫైన్ విధించినట్లు వెల్లడించారు. కోవిడ్ నిబంధనలను పకడ్బందీగా అమలు చేయటం తమ బాధ్యతని..నిరంతరం పాట్రోలింగ్ బృందాల నిఘా కొనసాగుతుందనే విషయాన్ని ప్రజలు గుర్తుంచుకోవాలని పోలీసులు హెచ్చరించారు.
తాజా వార్తలు
- అల్-సువేదాలో సంక్షోభ పరిష్కార రోడ్మ్యాప్ను స్వాగతించిన ఖతార్..!!
- ఇజ్రాయెల్ దురాక్రమణను తీవ్రంగా ఖండించిన సౌదీ క్యాబినెట్..!!
- బహ్రెయిన్ సోషల్ ఇన్సూరెన్స్ ఫ్రాడ్ కేసు.. పది మందిని దోషులుగా తేల్చిన కోర్టు..!!
- వీడియో వైరల్.. కార్ అద్దె కంపెనీ సిబ్బంది అరెస్టు..!!
- బిగ్ టికెట్ వీక్లీ డ్రాలో విజేతలుగా నలుగురు భారతీయులు..!!
- కువైట్లో కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం.. ట్రాఫిక్ సమస్యలపై సమీక్ష..!!
- ప్రధాని మోదీ జన్మదిన వేడుకల్లో రక్తదాన మహోత్సవం
- ప్రభుత్వ సలహాదారుగా NVS రెడ్డి
- నేడు లండన్లో మంత్రి నారా లోకేశ్ నేతృత్వంలో రోడ్ షో
- సౌదీ అరేబియాలో భారీగా మాదకద్రవ్య పిల్స్ సీజ్..!!