యూఏఈ:కోవిడ్ రూల్స్ బ్రేక్..క్రికెట్ ఆడుతున్న 13 మందికి ఫైన్
- March 04, 2021
యూఏఈ:ఓ వైపు సెకండ్ వేవ్ ముప్పు ముంచుకొస్తుండటంతో ప్రభుత్వం ఆంక్షలను మళ్లీ కఠినతరం చేస్తుంటే..కొందరు యువతకు మాత్రం అవేం పట్టడం లేదు. బహిరంగ ప్రాంతాల్లో ఐదుగురికి మించి ఎక్కువ మంది ఒకే దగ్గర పోగవ్వొద్దని సూచించిన ఆరోగ్య శాఖ..సమాజ ఆరోగ్య సంరక్షణ కోసం అన్ని స్పోర్ట్స్ ఈవెంట్లను రద్దు చేసిన విషయం తెలిసిందే. అయితే..షార్జాలో కొందరు యువకులు ఆరోగ్య శాఖ సూచనలను, కోవిడ్ నిబంధనలను పట్టించుకోకుండా క్రికెట్ ఆడుతూ బుక్కైపోయారు. అనుమతి లేని ప్రాంతంలో కోవిడ్ నిబంధనలను ఉల్లంఘిస్తూ క్రికెట్ ఆడుతూ పాట్రోలింగ్ చేస్తున్న పోలీసులకు పట్టుబడినట్లు అధికారులు వెల్లడించారు. నిబంధనలు ఉల్లంఘించిన 13 మందికి ఫైన్ విధించినట్లు వెల్లడించారు. కోవిడ్ నిబంధనలను పకడ్బందీగా అమలు చేయటం తమ బాధ్యతని..నిరంతరం పాట్రోలింగ్ బృందాల నిఘా కొనసాగుతుందనే విషయాన్ని ప్రజలు గుర్తుంచుకోవాలని పోలీసులు హెచ్చరించారు.
తాజా వార్తలు
- ఏఐ ప్రభావం షాకింగ్, ఉద్యోగాలకు భారీ ముప్పు?
- Bangladesh: తారిక్ రెహమాన్ ప్రధాని కావడం భారత్కు ప్రయోజనమా?
- బంపర్ ఆఫర్ ప్రకటించిన ప్రముఖ రియల్టీ సంస్థ అన్విత గ్రూప్
- ఏపీ బడ్జెట్ 2026-27: దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణం
- అంతర్జాతీయ మాదకద్రవ్య ముఠాను ఛేదించిన యూఏఈ, కువైట్..!!
- కువైట్ ఎంబసీలో నేషనల్, లిబరేషన్ డే సెలబ్రేషన్స్..!!
- GCC లో పనిచేసే బహ్రెయిన్లకు నిరుద్యోగ బీమా..!!
- ఖసాబ్ లో భూకంపం వివరాలు వెల్లడి..!!
- ఖతార్ లో రెండు రోజులపాటు స్ట్రాంగ్ విండ్స్..!!
- గాజా సంక్షోభం .. గ్లోబల్ వైఫల్యం: సౌదీ FM









