శ్రీశైలం:నేటి నుంచి మహాశివరాత్రి ఉత్సవాలు
- March 04, 2021_1614838231.jpg)
శ్రీశైలం: శ్రీశైలంలో నేటి నుంచి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ముఖ్యమైన మల్లికార్జునుడితో పాటు శక్తిపీఠంగా భ్రమరాంబాదేవి కూడా కొలువైన శ్రీశైలంలో 14వ తేదీ వరకూ 11 రోజుల పాటు అంగరంగ వైభవంగా బ్రహ్మోత్సవాలను నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే శ్రీశైల పట్టణమంతా విద్యుద్దీప కాంతులతో వెలిగిపోతోంది. తొలిరోజు ఉత్సవాలకే భక్తులు అధిక సంఖ్యలో చేరుకోవడంతో అద్దె గదుల కొరత ఏర్పడింది.
ఈ సంవత్సరం కొవిడ్ నిబంధనలను అనుసరిస్తూ, ఉత్సవాలను నిర్వహిస్తామని అధికారులు వెల్లడించారు. భక్తుల వసతి, వాహనాల పార్కింగ్ కు ప్రత్యేక ఏర్పాటు చేశామని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ బస్సులను మాత్రమే బస్టాండ్ లోకి అనుమతిస్తామని, కర్ణాటక, తెలంగాణ ఆర్టీసీ బస్సులకు గణేశ్ సదనానికి ఎదురుగా పార్కింగ్ ఏర్పాటు చేశామని ఉన్నతాధికారులు తెలిపారు. కార్ల కోసం జెడ్పీ హైస్కూల్ ప్రాంగణం, ఘంటామఠం వెనుక భాగంలో ఏర్పాట్లు చేశామన్నారు.
ఇక నేటి ఉదయం బ్రహ్మోత్సవాలకు ప్రారంభ సూచికగా, ధ్వజారోహణం కార్యక్రమం జరిగింది. ఈ 11 రోజులూ విశేష పూజలు కొనసాగుతాయని, గ్రామోత్సవం, ఇతర ఆర్జిత సేవలను రద్దు చేశామని ఆలయ ఈఓ వెల్లడించారు. భక్తులకు విక్రయించేందుకు చాలినంత ప్రసాదాలను సిద్ధం చేశామని అన్నారు.
తాజా వార్తలు
- నేడు లండన్లో మంత్రి నారా లోకేశ్ నేతృత్వంలో రోడ్ షో
- సౌదీ అరేబియాలో భారీగా మాదకద్రవ్య పిల్స్ సీజ్..!!
- సమాహీజ్ ఇంట్లో అగ్నిప్రమాదం..ఒకరు మృతి..!!
- దుబాయ్ లో టెనంట్స్ కు బంపర్ డీల్స్..!!
- సోషల్ మీడియా ద్వారా ట్రాఫిక్ ఉల్లంఘనల పర్యవేక్షణ.!.!
- వాహనాల నుండి వస్తువుల చోరీ.. వ్యక్తి అరెస్టు..!!
- ఖతార్ కు సంఘీభావంగా నిలిచిన అరబ్-ఇస్లామిక్ దేశాలు..!!
- శ్రీవారి బ్రహ్మోత్సవాల బుక్లెట్ విడుదల
- డ్రగ్స్ కేసుల్లో చిక్కుకున్న విదేశీయులను వెనక్కి పంపనున్న కేంద్రం
- టీటీడీ ఈవోకు శుభాకాంక్షలు తెలిపిన టిటిడి పాలక మండలి