పర్యటన ఫలప్రదమైందని : కేపీ ఓలి
- February 27, 2016
భారత్లో తన పర్యటన ఫలప్రదమైందని నేపాల్ ప్రధాని కేపీ ఓలి తెలిపారు. మాదేషీల ఆందోళనతో ఇరుదేశాల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. కానీ ద్వైపాక్షిక సంబంధాల మెరుగుదలకు నా పర్యటన దోహదపడింది అని భైరాఘవలో జరిగిన సభలో చెప్పారు. రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న మాదేషీ పార్టీల ఐక్య ప్రజాతంత్ర ఫ్రంట్ మాత్రం భారత్లో ప్రధాని ఓలి పర్యటన పూర్తిగా విఫలమైందని, ఎటువంటి ఎజెండాలేకుండా ఆయన భారత్లో పర్యటించడం పొరపాటని పేర్కొంది. తమ డిమాండ్లు పరిష్కారం కాకపోతే మరోదఫా ఆందోళన చేస్తామని శనివారం సమావేశం తర్వాత తెలిపింది. తమ డిమాండ్ల పరిష్కారానికి కార్యాచరణ ప్రణాళిక రూపొందించకపోతే ప్రభుత్వంతో చర్చలు జరిపే ప్రసక్తే లేదని పేర్కొంది.
తాజా వార్తలు
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...







