పర్యటన ఫలప్రదమైందని : కేపీ ఓలి

- February 27, 2016 , by Maagulf
పర్యటన ఫలప్రదమైందని : కేపీ ఓలి

భారత్‌లో తన పర్యటన ఫలప్రదమైందని నేపాల్ ప్రధాని కేపీ ఓలి తెలిపారు. మాదేషీల ఆందోళనతో ఇరుదేశాల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. కానీ ద్వైపాక్షిక సంబంధాల మెరుగుదలకు నా పర్యటన దోహదపడింది అని భైరాఘవలో జరిగిన సభలో చెప్పారు. రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న మాదేషీ పార్టీల ఐక్య ప్రజాతంత్ర ఫ్రంట్ మాత్రం భారత్‌లో ప్రధాని ఓలి పర్యటన పూర్తిగా విఫలమైందని, ఎటువంటి ఎజెండాలేకుండా ఆయన భారత్‌లో పర్యటించడం పొరపాటని పేర్కొంది. తమ డిమాండ్లు పరిష్కారం కాకపోతే మరోదఫా ఆందోళన చేస్తామని శనివారం సమావేశం తర్వాత తెలిపింది. తమ డిమాండ్ల పరిష్కారానికి కార్యాచరణ ప్రణాళిక రూపొందించకపోతే ప్రభుత్వంతో చర్చలు జరిపే ప్రసక్తే లేదని పేర్కొంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com