రమదాన్ టెంట్లు రద్దు..నిర్దిష్ట ప్రణాళికతో ఇఫ్తార్
- March 06, 2021
అజ్మన్:రమదాన్ పవిత్ర మాసంలో నిర్వహించే రమదాన్ టెంట్లకు ఈ సారి అనుమతి ఇవ్వటం లేదని అజ్మన్ పాలనా యంత్రాంగం స్పష్టం చేసింది. అయితే..గుర్తింపు పొందిన స్వచ్ఛంద సంస్థల సహకారంతో నిర్దిష్టమైన ప్రణాళిక మేరకు ఇఫ్తార్ మీల్స్ డిస్ట్రిబ్యూషన్ నిర్వహిస్తామని వెల్లడించింది. కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా వైరస్ వ్యాప్తి నియంత్రణకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. పవిత్ర రమదాన్ మాసంలో ఇఫ్తార్ విందు ఇవ్వటం అనవాయితీ. పేదలు, కార్మికులకు మసీదుల నిర్వాహకులు, స్వచ్ఛంద సంస్థలు, పలువురు ప్రముఖులు ఇఫ్తార్ విందు ఇస్తూంటారు. అయితే..విందు ఏర్పాటు ద్వారా కోవిడ్ రూల్స్ బ్రేక్ చేసే అవకాశాలు ఉన్నాయని, భౌతిక దూరం పాటించటంలోనూ విఫలం అయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయని అజ్మన్ పాలనా యంత్రాంగం అధికారులు అభిప్రాయపడ్డారు. ప్రజల ఆరోగ్య భద్రతను దృష్టిలో ఉంచుకొనే రమదాన్ టెంట్లకు అనుమతి ఇవ్వకూడదని నిర్ణయించినట్లు స్పష్టం చేసింది. అయితే..ఎండోమెంట్స్ కోఆర్డినేషన్ కౌన్సిల్ అనుమతి పొందిన స్వచ్ఛంద సంస్థలు..కౌన్సిల్ సూచనల ప్రకారం ఇఫ్తార్ మీల్స్ ను పంపిణీ చేసేలా నిర్ధిష్ట ప్రణాళికను సిద్ధం చేసినట్లు వెల్లడించారు.
తాజా వార్తలు
- ఫేక్ డాక్యుమెంట్లతో సిమ్ తీసుకుంటే జైలే..!!
- నకిలీ ‘కన్స్యూమర్ ప్రొటెక్షన్’ లింక్ల పై దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- కార్వ్ సంస్థకు 4 మిలియన్ డాలర్ల కమిట్మెంట్
- అమరావతిలో మరో ఐకానిక్ నిర్మాణం APNRT టవర్!
- దుబాయ్లో ఎయిర్ ట్యాక్సీలకు గ్రీన్ సిగ్నల్..
- ఖమ్మంలో డీజీపీ సి.వి.ఆనంద్ క్రైమ్ సమీక్ష..'బ్యాక్ టు బేసిక్స్'తో సమర్థ పోలీసింగ్కు పిలుపు
- భారత్ ను చూసి ఇండోనేషియా ఎంతో నేర్చుకోవాలి: ఇండోనేషియా ప్రెసిడెంట్
- పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యం..దక్షిణ కొరియాలో మంత్రి లోకేశ్ బిజీ షెడ్యూల్
- ఖతార్ లో భవిష్యత్ ఉద్యోగ అవసరాలకు అనుగుణంగా స్కాలర్షిప్లు..!!
- ప్యాకేజ్ వీసా.. సౌదీ ప్రయాణం మరింత సులభం..!!







