నైట్ టైం ఆంక్షలను ఉల్లంఘిస్తే 300 రియాల్స్ ఫైన్
- March 06, 2021
మస్కట్:కోవిడ్ వ్యాప్తిని వీలైనంత మేర అరికట్టేందుకు సుప్రీం కమిటీ సూచించిన మార్గనిర్దేశకాలను ప్రజలు, వాణిజ్య కేంద్రాల నిర్వాహకులు తప్పనిసరిగా పాటించాల్సిందేనని మస్కట్ మున్సిపాలిటీ వెల్లడించింది. వైరస్ తీవ్రత పెరుగుతుండటంతో రాత్రి 8 నుంచి ఉదయం 5 గంటల వరకు వాణిజ్య కేంద్రాలు మూసివేయాలని సూప్రీం కమిటీ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నిబంధనలను ఎవరైనా ఉల్లంఘిస్తే 300 రియాల్స్ వరకు జరిమానా విధిస్తామని మున్సిపాలిటీ అధికారులు హెచ్చరించారు.రెండో సారి కూడా ఉల్లంఘనకు పాల్పడితే 1000 రియాల్స్ తో పాటు బిజినెస్ లైసెన్స్ ను కూడా రద్దు చేస్తామని వార్నింగ్ ఇచ్చారు. పాక్షిక ఆంక్షలు రెస్టారెంట్లు,కేఫ్ లకు కూడా వర్తిస్తాయని, ఆంక్షలు అమలులో ఉన్న సమయంలో హోం డెలివరీకి కూడా అనుమతి లేదని స్పష్టం చేశారు.అయితే..అత్యవసర రంగాలైన వైద్య కేంద్రాలు, ప్రైవేట్ ఫార్మసీ, పెట్రోల్ బంకులకు ఆంక్షల నుంచి మినహాయింపు ఉందని, అలాగే ప్రజలు తమ సొంత వాహనాల్లో ప్రయాణించేందుకు కూడా అనుమతి ఉంటుందని స్పష్టత ఇచ్చింది.
--లెనిన్ కుమార్(మాగల్ఫ్ ప్రతినిధి,ఒమన్)
తాజా వార్తలు
- ఫేక్ డాక్యుమెంట్లతో సిమ్ తీసుకుంటే జైలే..!!
- నకిలీ ‘కన్స్యూమర్ ప్రొటెక్షన్’ లింక్ల పై దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- కార్వ్ సంస్థకు 4 మిలియన్ డాలర్ల కమిట్మెంట్
- అమరావతిలో మరో ఐకానిక్ నిర్మాణం APNRT టవర్!
- దుబాయ్లో ఎయిర్ ట్యాక్సీలకు గ్రీన్ సిగ్నల్..
- ఖమ్మంలో డీజీపీ సి.వి.ఆనంద్ క్రైమ్ సమీక్ష..'బ్యాక్ టు బేసిక్స్'తో సమర్థ పోలీసింగ్కు పిలుపు
- భారత్ ను చూసి ఇండోనేషియా ఎంతో నేర్చుకోవాలి: ఇండోనేషియా ప్రెసిడెంట్
- పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యం..దక్షిణ కొరియాలో మంత్రి లోకేశ్ బిజీ షెడ్యూల్
- ఖతార్ లో భవిష్యత్ ఉద్యోగ అవసరాలకు అనుగుణంగా స్కాలర్షిప్లు..!!
- ప్యాకేజ్ వీసా.. సౌదీ ప్రయాణం మరింత సులభం..!!







