ఈవెంట్లకు హాజరయ్యే అతిథులు పీసీఆర్ టెస్ట్ చేయించుకోవాల్సిందే
- March 09, 2021అబుధాబి:అబుధాబిలో నిర్వహించే ఏ ఈవెంట్లకు సంబంధించి కొత్త మార్గనిర్దేశకాలను జారీ చేసింది పాలనా యంత్రాంగం. బిజినెస్, ఎంటర్టైన్మెంట్ ఈవెంట్లకు వెళ్లాలనుకునే వారు ఖచ్చితంగా పీసీఆర్ టెస్ట్ చేయించుకోవాల్సిందేనని ఆదేశించింది. ఈవెంట్ కు వెళ్లే 48 గంటలలోపు పీసీఆర్ టెస్ట్ రిపోర్ట్ లను మాత్రమే పరిగణలోకి తీసుకోనున్నట్లు వివరించింది. అలాగే ఈవెంట్ నిర్వాహకులు కూడా పీసీఆర్ టెస్ట్ చేయించుకోవాలని సూచించింది. వారంపైగా నిర్వహించే ఈవెంట్లైతే ప్రతి ఏడు రోజులకు ఓ సారి పీసీఆర్ టెస్ట్ చేయించుకోవాల్సి ఉంటుంది. ఈవెంట్లకు సంబంధించి ఎంత మందికి అనుమతి ఇవ్వాలనేది కూడా అబుధాబి పాలనా యంత్రాంగం ఖరారు చేసింది. ప్రైవేట్ బీచులు, స్విమ్మింగ్ పూల్స్ లో 60 శాతం, బిజినెస్ ఈవెంట్లకు 50 శాతం, ఎంటర్టైన్మెంట్ ఈవెంట్లకు పూర్తి సామర్థ్యంలో 30 శాతం మందికి మాత్రమే అనుమతి ఉంటుందని స్పష్టం చేసింది. కోవిడ్ నిబంధనలను ఉల్లంఘిస్తే నిర్వాహకులు కఠిన చర్యలు ఎదుర్కొవాల్సి వస్తుందని అధికారులు హెచ్చరించారు.
తాజా వార్తలు
- ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై నీతి ఆయోగ్ సంచలన ప్రకటన
- హైదరాబాద్లో అనేక ప్రాంతాల్లో భారీ వర్షం
- CBSE పాఠశాలలు ఓపెన్-బుక్ పరీక్షలను నిర్వహిస్తాయా?
- స్లోవాక్ ప్రధానిపై హత్యాయత్నం.. తీవ్రంగా ఖండించిన ఖతార్
- వీసా కోసం లంచం...ఉద్యోగికి 4 ఏళ్ల జైలుశిక్ష
- గాజా భవిష్యత్తు. నెతన్యాహుపై క్యాబినెట్ అసంతృప్తి..!
- ఒమన్ ఎయిర్ వింటర్ షెడ్యూల్ పొడిగింపు
- ఏపీలో సంక్షేమ పథకాల అమలుకు నిధులు విడుదల
- ఉద్యోగులకు ఎమిరేట్స్ బోనస్. ప్రైవేట్ కంపెనీలు అనుసరిస్తాయా?
- ఏపీ ఎన్నికల ఫలితాలపై రూ.కోట్లలో బెట్టింగ్లు