కోవిడ్ రూల్స్ బ్రేక్..జిమ్ ట్రైనర్ కు జైలు శిక్ష, జరిమానా
- March 12, 2021
బహ్రెయిన్:బహ్రెయిన్లో కోవిడ్ రూల్స్ ను ఉల్లంఘించిన జిమ్ ట్రైనర్ కు జైలుశిక్షతో పాటు జరిమానా విధించింది కోర్టు. అలాగే జిమ్ ఓనర్ కు కూడా జరిమానా విధిస్తూ తీర్పునిచ్చింది. వైరస్ వ్యాప్తి నియంత్రణకు జిమ్ములు, స్విమ్మింగ్ పూల్ నిర్వహణపై స్పష్టమైన మార్గనిర్దేశకాలు జారీ చేసిన విషయం తెలిసిందే. విధిగా ఫేస్ మాస్కులు ధరించటంతో పాటు..భౌతిక దూరం పాటించేందుకు అనుగుణంగా పరిమిత సంఖ్యలోనే జనాలను అనుమతించాల్సి ఉంటుంది. అయితే..ప్రస్తుతం కోవిడ్ రూల్స్ బ్రేక్ చేసిన జిమ్ లో ఏకంగా కోవిడ్ పాజిటివ్ వ్యక్తులను కూడా అనుమతించినట్లు అధికారులకు ఫిర్యాదులు అందాయి. దీంతో బహ్రెయిన్ ఆరోగ్య శాఖ అధికారులు జిమ్ లో తనిఖీలు చేపట్టారు. జిమ్ములో పరిమితి సంఖ్యకు మించి ఎక్కువ సంఖ్యలో జనాలను అనుమతించారని, భౌతిక దూరం పాటించలేదని, ఎవరికి ఫేస్ మాస్కులు కూడా లేవని తమ తనిఖీల్లో నిర్ధారణ అయినట్లు అధికారులు వివరించారు. కోవిడ్ నిబంధనలు ఉల్లంఘించినందుకు జిమ్ ట్రైనర్, జిమ్ ఓనర్ ను కోర్టు ముందు హజరు పరిచారు. విచారణ చేపట్టిన కోర్టు ప్రవాసీయుడైన జిమ్ ట్రైనర్ కు ఏడాది జైలుశిక్షతో పాటు 3,000 దినార్ల జరిమానా విధించింది. అలాగే జిమ్ ఓనర్ కు కూడా 3,000 దినార్ల జరిమానా విధిస్తూ తీర్పునిచ్చింది.
--రాజేశ్వర్(మాగల్ఫ్ ప్రతినిధి,బహ్రెయిన్)
తాజా వార్తలు
- సీజేపీతో ముగిసిన కేంద్రం చర్చలు..
- గ్లోబల్గా చాట్జీపీటీ డౌన్..
- ‘మేక్ ఇన్ ఇండియా’కు వైద్యరంగంలో మరో మైలురాయి
- అమరావతి బ్రాండ్ను ప్రపంచానికి చాటే చెప్పేలా ‘స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026’
- పోలీసుల అరాచకాల పై చర్యలు తీసుకోవాలని అభిజీత్ డిప్కే డిమాండ్
- మహిళ హత్య కేసు.. మరణశిక్షను రద్దు చేసిన యూఏఈ సుప్రీంకోర్టు..!!
- పేపర్ లీకేజీలకు చెక్.. కొత్త బిల్లు డ్రాఫ్ట్ విడుదల చేసిన కేంద్రం
- ఎంబసీ సాయం.. తండ్రి అంత్యక్రియలకు హాజరైన మహిళ..!!
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. పర్యాటక ప్రాంతాల్లో భద్రతా చర్యలు ముమ్మరం..!!
- ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా పై సోనమ్ వాంగ్చుక్ సంచలన పోస్ట్!







