సొగసు వల వేసి దోచేస్తున్న 8 మంది మహిళల అరెస్ట్

- March 14, 2021 , by Maagulf
సొగసు వల వేసి దోచేస్తున్న 8 మంది మహిళల అరెస్ట్

మస్కట్: సొగసు వల వేసి పురుషులను ప్రలోభ పెట్టి నిలువు దోపిడి చేస్తున్న 8 మంది మహిళలను రాయల్ ఒమన్ పోలీసులు అరెస్ట్ చేశారు. మస్కట్ గవర్నరేట్ పరిధిలో నిందితులు దోపిడిలకు పాల్పడుతున్నట్లు పోలీసులు వెల్లడించారు. నిందితులు అందరూ ఆఫ్రికాకు చెందిన వారని తెలిపారు. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం..ఆఫ్రికన్ మహిళలు సోషల్ మీడియాలోని కొన్ని అశ్లీల ఫోటోలను చూపించి పురుషులకు వలసు వల విసిరేవారు. అందాల విందు కావాలంటే తమ నివాసానికి రావాలంటూ ఆశపెట్టేవారు. వలపు వలకు టెంప్ట్ అయిన పురుషులు వారి నివాసానికి రాగానే వారిని దోచుకునేవారు. ఆ ఆఫ్రికన్లపై ఫిర్యాదులు రావటంతో నిందితులపై ఫోకస్ చేసిన పోలీసులు 8 మందిని అరెస్ట్ చేశారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com