లోక్ సభ లో గళమెత్తినవిశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ
- March 16, 2021* ఆంధ్రాలో పెండింగ్ లో ఉన్న 13 మెడికల్ కాలేజీ ల నిర్మాణాలకు ఆర్ధిక సహాయాన్ని అందించండి.
*ప్రధమ శ్రేణి నగరాలలో పబ్లిక్ ఆసుపత్రుల స్థాపనకు చొరవ చూపండి.
*ప్రశ్నోత్తరాల సమయంలో వైద్య రంగ లో ప్రత్యేక అవశ్యకతల గురించి లోక్ సభలో ప్రస్తావన.
న్యూ ఢిల్లీ: ఆంధ్ర ప్రదేశ్ లో పెండింగ్ లో ఉన్న 13 మెడికల్ కాలేజ్ ల నిర్మాణాలకు సంబంధించి ఆర్ధిక సహాయాన్ని అందించాలని విశాఖ ఎంపీ ఎంవీ వీ సత్యనారాయణ అన్నారు. లోక్ సభలో ప్రశ్నోత్తరాల సమయంలో ఆయన ఆంధ్రప్రదేశ్ లో వైద్య అవసరాలకు సంబంధించి మెడికల్ కాలేజీ ల అవశ్యకతను ప్రస్తుతించారు. విభజన తదుపరి రూపుదిద్దుకున్న ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం ప్రథమ శ్రేణి మినహా, ద్వితీయ, తృతీయ శ్రేణీ నగరాలు మాత్రమే ఉన్నాయన్నారు. ఈ క్రమంలో ప్రైవేట్ సెక్టార్ లో మాత్రమే అంతంత మాత్రంగా సూపర్ స్పెషాలిటీ హెల్త్ కేర్ సర్వీసులు ప్రజలకు అందుతున్నాయన్నారు. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ లో పబ్లిక్ సెక్టార్ లో పలు నిర్మాణాల అవశ్యకత ఎంతైనా ఉందన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ విషయం పై ఇప్పటికే దృష్టి సారించి, ప్రజారోగ్యాన్ని పరిగణలో కి తీసుకుని నాణ్యమైన వైద్యాన్ని, తక్కువ ఖర్చుతో అందిస్తోందన్నారు. ఈ క్రమంలో పేద ప్రజల వైద్యాన్ని దృష్టి లో ఉంచుకుని ఆంధ్రప్రభుత్వం వై ఎస్ ఆర్ ఆరోగ్య శ్రీ ప్రోగ్రాం ద్వారా విస్కృత సేవలు అందిస్తోందన్నారు.
ఇప్పటికే ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం 16 నూతన మెడికల్ కాలేజీ లను స్థాపించేందుకు ప్రణాళికలు సిద్ధంచేయగా , అందులో కేంద్రప్రభుత్వం మూడు నూతన కాలేజీ ల స్థాపనకు పచ్చజెండా ఊపడం సంతోషకరమన్నారు. తక్కిన 13 కాలేజీ ల స్థాపనకు మరింత చొరవచూపి ఆర్ధిక సహాయాన్ని అందించాలని ఎంపీ ఈ సందర్భంగా కోరారు.
తాజా వార్తలు
- పాకిస్థాన్లో అధికారికంగా ప్రారంభమైన యోగా
- నరేంద్ర మోడీ మరోసారి ప్రధాన మంత్రి కావాలి..గల్ప్ కార్మికుల మద్దతు..!
- ప్రత్యేక లేబర్ డే ట్రీట్.. 16 మంది కార్మికులకు అరుదైన అవకాశం
- రవాబీ హైపర్మార్కెట్లో మ్యాంగో ఫియస్టా ప్రారంభం
- అవినీతి లేదా రాజద్రోహానికి పాల్పడిన అధికారులకు 'హిస్ ఎక్సలెన్సీ' బిరుదు తొలగింపు
- వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ 2024..18 స్థానాలు ఎగబాకిన ఒమన్
- దుబాయ్ ఆర్ట్ గ్యాలరీలో అమ్మకానికి 'పురాతన సముద్రపు డ్రాగన్' పుర్రె
- తల్లిదండ్రులకు స్కూల్ ఫీజు పెంపు నోటిఫికేషన్లు
- తిరుమలలో భక్తుల రద్దీ..
- ఫేక్ యాప్స్కు గూగుల్ చెక్