మహేష్ తో జాన్వీ జత కడుతుందా?!

- March 16, 2021 , by Maagulf
మహేష్ తో జాన్వీ జత కడుతుందా?!

సూపర్‌ స్టార్‌ కృష్ణ, అలనాటి అందాల తార శ్రీదేవి కలిసి నటించిన ఎన్నో సినిమాలు సూపర్‌ డూపర్‌ హిట్లుగా నిలిచిన విషయం అందరికీ తెలిసిందే. నువ్వానేనా అన్నట్లు పోటాపోటీగా నటించే వీరి సినిమాలను అభిమానులు పోటీపడి మరీ చూసేవారు. అప్పట్లో వీరి జోడీకి అంత క్రేజ్‌ ఉండేది. ఇదిలా వుంటే కృష్ణ కుమారుడు సూపర్‌ స్టార్‌ మహేశ్‌బాబు, శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్‌ జోడీగా నటించనున్నట్లు ఫిల్మీ దునియాలో వార్తలు వినిపిస్తున్నాయి. దీనికి కరణ్‌ జోహార్‌ నిర్మాతగా వ్యవహరించనన్నట్లు టాక్‌. పైగా ఈ సినిమాతో ఓ కొత్త దర్శకుడిని వెండితెరకు పరిచయం చేసే ప్లాన్‌లో ఉన్నారట. షూటింగ్‌ను కూడా సాగదీయకుండా కేవలం రెండు నెలల్లోనే ముగించే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. మరి ఈ ప్రాజెక్ట్‌ ఎప్పుడు ముందుకెళ్తుంది? అసలు పట్టాలెక్కుతుందా? లేదా? అనేది తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చేవరకు వేచి చూడాల్సిందే!

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com