లోక్ సభ లో గళమెత్తినవిశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ
- March 16, 2021* ఆంధ్రాలో పెండింగ్ లో ఉన్న 13 మెడికల్ కాలేజీ ల నిర్మాణాలకు ఆర్ధిక సహాయాన్ని అందించండి.
*ప్రధమ శ్రేణి నగరాలలో పబ్లిక్ ఆసుపత్రుల స్థాపనకు చొరవ చూపండి.
*ప్రశ్నోత్తరాల సమయంలో వైద్య రంగ లో ప్రత్యేక అవశ్యకతల గురించి లోక్ సభలో ప్రస్తావన.
న్యూ ఢిల్లీ: ఆంధ్ర ప్రదేశ్ లో పెండింగ్ లో ఉన్న 13 మెడికల్ కాలేజ్ ల నిర్మాణాలకు సంబంధించి ఆర్ధిక సహాయాన్ని అందించాలని విశాఖ ఎంపీ ఎంవీ వీ సత్యనారాయణ అన్నారు. లోక్ సభలో ప్రశ్నోత్తరాల సమయంలో ఆయన ఆంధ్రప్రదేశ్ లో వైద్య అవసరాలకు సంబంధించి మెడికల్ కాలేజీ ల అవశ్యకతను ప్రస్తుతించారు. విభజన తదుపరి రూపుదిద్దుకున్న ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం ప్రథమ శ్రేణి మినహా, ద్వితీయ, తృతీయ శ్రేణీ నగరాలు మాత్రమే ఉన్నాయన్నారు. ఈ క్రమంలో ప్రైవేట్ సెక్టార్ లో మాత్రమే అంతంత మాత్రంగా సూపర్ స్పెషాలిటీ హెల్త్ కేర్ సర్వీసులు ప్రజలకు అందుతున్నాయన్నారు. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ లో పబ్లిక్ సెక్టార్ లో పలు నిర్మాణాల అవశ్యకత ఎంతైనా ఉందన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ విషయం పై ఇప్పటికే దృష్టి సారించి, ప్రజారోగ్యాన్ని పరిగణలో కి తీసుకుని నాణ్యమైన వైద్యాన్ని, తక్కువ ఖర్చుతో అందిస్తోందన్నారు. ఈ క్రమంలో పేద ప్రజల వైద్యాన్ని దృష్టి లో ఉంచుకుని ఆంధ్రప్రభుత్వం వై ఎస్ ఆర్ ఆరోగ్య శ్రీ ప్రోగ్రాం ద్వారా విస్కృత సేవలు అందిస్తోందన్నారు.
ఇప్పటికే ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం 16 నూతన మెడికల్ కాలేజీ లను స్థాపించేందుకు ప్రణాళికలు సిద్ధంచేయగా , అందులో కేంద్రప్రభుత్వం మూడు నూతన కాలేజీ ల స్థాపనకు పచ్చజెండా ఊపడం సంతోషకరమన్నారు. తక్కిన 13 కాలేజీ ల స్థాపనకు మరింత చొరవచూపి ఆర్ధిక సహాయాన్ని అందించాలని ఎంపీ ఈ సందర్భంగా కోరారు.
తాజా వార్తలు
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ
- కేరళలో హెపటైటిస్ కలకలం..12 మంది మృతి