మహేష్ తో జాన్వీ జత కడుతుందా?!
- March 16, 2021సూపర్ స్టార్ కృష్ణ, అలనాటి అందాల తార శ్రీదేవి కలిసి నటించిన ఎన్నో సినిమాలు సూపర్ డూపర్ హిట్లుగా నిలిచిన విషయం అందరికీ తెలిసిందే. నువ్వానేనా అన్నట్లు పోటాపోటీగా నటించే వీరి సినిమాలను అభిమానులు పోటీపడి మరీ చూసేవారు. అప్పట్లో వీరి జోడీకి అంత క్రేజ్ ఉండేది. ఇదిలా వుంటే కృష్ణ కుమారుడు సూపర్ స్టార్ మహేశ్బాబు, శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ జోడీగా నటించనున్నట్లు ఫిల్మీ దునియాలో వార్తలు వినిపిస్తున్నాయి. దీనికి కరణ్ జోహార్ నిర్మాతగా వ్యవహరించనన్నట్లు టాక్. పైగా ఈ సినిమాతో ఓ కొత్త దర్శకుడిని వెండితెరకు పరిచయం చేసే ప్లాన్లో ఉన్నారట. షూటింగ్ను కూడా సాగదీయకుండా కేవలం రెండు నెలల్లోనే ముగించే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. మరి ఈ ప్రాజెక్ట్ ఎప్పుడు ముందుకెళ్తుంది? అసలు పట్టాలెక్కుతుందా? లేదా? అనేది తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చేవరకు వేచి చూడాల్సిందే!
తాజా వార్తలు
- 7న ప్రత్యక్షంగా కోర్టులో ఎమ్మెల్సీ కవిత ని హాజరుపరచండి
- శంషాబాద్ సమీపంలో 34 కేజీల బంగారం స్వాధీనం
- ఆడబిడ్డకు జన్మనిచ్చిన దుబాయ్ రాయల్ షేఖా మహరా
- 17 ఏళ్ల బాలుడు మిస్సింగ్ కేసు విషాదాంతం
- 123 మంది కార్మికుల పై బహిష్కరణ వేటు
- భారత ప్రవాసుల కోసం 'ఓపెన్ హౌస్'
- స్విఫ్ట్ స్టూడెంట్ ఛాలెంజ్.. 'మై చైల్డ్' యాప్ కు ప్రశంసలు
- ఇకపై 'వ్యాక్సినేషన్ స్టేటస్' ఉండదు..!
- గ్రీన్ టెక్నాలజీ పై SAS 48 హ్యాకథాన్ ప్రారంభం
- మే 13న నాలుగో విడత పోలింగ్..