తెలంగాణలో కరోనా కేసుల వివరాలు
- March 19, 2021
హైదరాబాద్:తెలంగాణలో కరోనా కేసులు మళ్ళీ పెరుగుతున్నాయా అంటే అవుననే అంటున్నాయి గణాంకాలు.తెలంగాణ ఆరోగ్యశాఖ తాజాగా కరోనా బులెటిన్ ను రిలీజ్ చేసింది. ఈ బులెటిన్ ప్రకారం కొత్తగా 313 కేసులు నమోదయ్యాయి.దీంతో తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,02,360కి చేరింది.ఇందులో 2,98,262 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 2,434 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి.ఇక తాజా బులెటిన్ ప్రకారం రాష్ట్రంలో కరోనాతో ఇద్దరు మృతి చెందారు.దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు కరోనాతో మృతి చెందినవారి సంఖ్య 1664కి చేరింది.కేసులు పెరుగుతుండటంతో ప్రభుత్వం అప్రమత్తం అయ్యింది.ముఖ్యంగా స్కూల్స్, ఆలయాల్లో కేసులు నమోదవుతుండటంతో వీటిపై దృష్టి సారించింది.
--హరి(మాగల్ఫ్ ప్రతినిధి,తెలంగాణ)
తాజా వార్తలు
- యూఏఈ నివాసులకు గుడ్ న్యూస్..Nol ట్రావెల్ కార్డుతో కారు అద్దెపై 40% వరకు డిస్కౌంట్
- భద్రాద్రిలో త్వరలో కొత్త విమానాశ్రయం: కేంద్ర మంత్రి
- గ్లోబల్ నాలెడ్జ్ హబ్గా హైదరాబాద్..
- ఉక్రెయిన్ పై రష్యా క్షిపణుల దాడి.. 12 మంది మృతి!
- వాహనాల మధ్య సేఫ్ డిస్టెన్స్.. ఉల్లంఘనకు SR300 ఫైన్..!!
- జీసీసీ దేశాల మధ్య ఆరోగ్య రంగంలో సహకారం బలోపేతం..!!
- ఖతార్లో చర్మవ్యాధులకు అధునాతన చికిత్సలు..!!
- ఫర్వానియాలో అగ్నిప్రమాదం.. పలు వాహనాలు దగ్ధం..!!
- ఒమన్లో విద్యార్థుల ఆన్లైన్ బదిలీ సేవలు పునరుద్ధరణ..!!
- అబుదాబి అద్దె నిబంధనలతో అద్దెదారులకు ఊరట..!!







