కరోనా వ్యాక్సిన్ పై క్లారిటీ...
- March 19, 2021న్యూ ఢిల్లీ: భారత్ లో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఈరోజు లోక్ సభలో కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్ క్లారిటీ ఇచ్చారు.కరోనా వ్యాక్సిన్ పై ఎలాంటి అనుమానాలు పెట్టుకోవద్దని మంత్రి హర్షవర్ధన్ పేర్కొన్నారు.దేశంలోని రెండు రకాల వ్యాక్సిన్లు సురక్షితమైనవని, అర్హులైన ప్రతి ఒక్కరు తప్పకుండా వ్యాక్సిన్ తీసుకోవాలని లోక్ సభలో హర్షవర్ధన్ పేర్కొన్నారు.ఈరోజు దేశంలో 39వేలకు పైగా కేసులు నమోదయ్యాయి.154 మంది కరోనాతో మృతి చెందారు.పాజిటివ్ కేసులు, మరణాల సంఖ్య పెరుగుతుండటంతో రాష్ట్రాలను కేంద్రం అలర్ట్ చేసింది.రోజుకు 30 లక్షలకు పైగా టీకాలు అందిస్తున్నారు.ఈ సంఖ్యను మరింతగా పెంచాలని ప్రభుత్వం చూస్తున్నది.దేశంలో టీకాకు కొరత లేదని, అదే సమయంలో టీకాలపై వస్తున్న అపోహలను తొలగించేందుకు కేంద్రం అన్ని రకాల చర్యలు తీసుకుంటుందని ఆరోగ్యశాఖ తెలియజేసింది.
తాజా వార్తలు
- హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ వ్యాపారి మోసం..
- ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో 128.79 కోట్ల నగదు సీజ్ చేశాం: ఈడీ
- విదేశీ బ్యాంకుల పై 20% కొత్త పన్ను.. కస్టమర్లు ఎక్కువ చెల్లించాలా?
- సౌదీకి 'A/A-1' క్రెడిట్ రేటింగ్.. ఎస్ అండ్ పీ
- 2.6 శాతం పెరిగిన కువైట్ జనాభా
- బహ్రెయిన్లో ప్రైవేట్ యూనివర్సిటీ పై స్టూడెంట్ దావా
- ఒమానీ ఫలాజ్ వ్యవస్థను ప్రోత్సహించడానికి ప్రాజెక్ట్లు..యునెస్కో
- ఈ నెల 27 నుంచి సీఎం జగన్ బస్సు యాత్ర
- దుబాయ్ కొత్త లోగోను ఆవిష్కరించిన క్రౌన్ ప్రిన్స్
- ప్రతి మహిళ శక్తి రూపంలో కన్పిస్తుంది: ప్రధాని మోడీ