‘మోసగాళ్ళు’ మూవీ రివ్యూ
- March 19, 2021బ్యానర్: 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ
నటీనటులు:విష్ణు మంచు, కాజల్ అగర్వాల్, రూహీ సింగ్, సునీల్ శెట్టి, నవదీప్, నవీన్ చంద్ర తదితరులు
సినిమాటోగ్రఫీ:షెల్డన్ చౌ
మ్యూజిక్:శ్యామ్ సి.ఎస్
పాటల రచయిత:సిరాశ్రీ
నిర్మాత:విష్ణు మంచు
దర్శకత్వం:జెఫ్రీ గీ చిన్
కథ:
అర్జున్ (మంచు విష్ణు), అను (కాజల్ అగర్వాల్) ఓ మధ్య తరగతి కుటుంబంలో జన్మించిన కవలలు. ఈ ఇద్దరిలో అను, అర్జున్ కంటే పెద్దది. వీళ్ళ నాన్న తనికెళ్ళ భరణి. నీతి, నిజాయితీని నమ్ముకొని బ్రతికే ఆయనను ఓ వ్యక్తి మోసం చేయడంతో వీరి కుటుంబం వీధిన పడుతుంది. రాణిగంజ్ లోని ఓ స్లమ్ ఏరియాలో నివాసం ఉంటూ కాలం వెళ్లదీస్తుంటారు. అయితే పెరిగి పెద్దయిన అర్జున్, అను ఉద్యోగ నిమిత్తం హైదరాబాద్ వస్తారు. అర్జున్ కాల్ సెంటర్లో పని చేస్తూ తన కుటుంబం కోసం బాగా డబ్బు సంపాదించి ఎలాగైనా కోటీశ్వరులం కావాలనే లక్ష్యంతో
కసిగా ఉంటాడు.
మంచి లాంగ్వేజ్ స్కిల్ ఉన్న అర్జున్ కాల్ సెంటర్లో జాబ్ చేస్తూ అక్కడి డాటా చోరీ చేస్తూ చిన్న చిన్న మోసాలకు పాల్పడుతుంటాడు. ఇతని స్కిల్ చూసి ఏకంగా ఆ కాల్ సెంటర్ యజమాని విజయ్ (నవదీప్) భారీ స్కామ్ చేద్దామని ఆఫర్ చేయడం, ఆ ఇద్దరు చేతులు కలిపి 70-30 డీల్ కుదుర్చుకొని అమెరికన్ల నుంచి డాలర్లు కొల్లగొట్టే అతిపెద్ద స్కామ్కి తెరలేపుతారు. వీరికి అర్జున్ అక్క అను తోడై ఈ భారీ మోసానికి సంబంధించిన అన్ని వ్యవహారాలు చూసుకుంటూ ఉంటుంది. ఐఆర్ఎస్ (ఇంటర్నల్ రెవెన్యూ సర్వీస్) పేరు చెప్పి అమెరికన్ల నుంచి డబ్బు గుంజుతూ మొదలైన వీరి కుంభకోణం ఇంతింతై పెద్ద కంపెనీగా ఆవిర్భవిస్తుంది. టాక్స్ పేరుతో అమెరికా ప్రజలను బెదిరిస్తూ 300 మిలియన్ డాలర్స్ (26 వేల కోట్లు) స్కామ్ చేస్తారు.
ఈ స్కామ్ని ఛేదించే ఆఫీసర్గా ఏసీపీ కుమార్ (సునీల్ శెట్టి) రంగంలోకి దిగడం అనేది సినిమాలో ట్విస్ట్. పై ఆఫీసర్ల నుంచి ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ధైర్యంగా అర్జున్ మోసాన్ని బయటపెట్టి చివరకు అరెస్ట్ చేస్తాడు ఏసీపీ కుమార్. మరి డబ్బు పవర్తో ఈ కేసు నుంచి అర్జున్ బయటపడ్డాడా.. లేదా? అను పరిస్థితి ఏంటి? నిజాయితీగా డబ్బు సంపాదించాలని భావించే అర్జున్ తండ్రికి ఈ భారీ స్కామ్ విషయం తెలిసిందా? తెలిస్తే ఏమన్నాడు? అనేదే ఈ మూవీ కథ.
రివ్యూ:
యదార్థ కథను రాసుకున్న మంచు విష్ణు హాలీవుడ్ డైరెక్టర్ జెఫ్రీ గీ చిన్ సహాయంతో ఈ సినిమాను బాగానే ప్రెజెంట్ చేశారని చెప్పుకోవాలి. ఓ అక్క, తమ్ముడు కలిసి భారీ మోసానికి పాల్పడటం అనేది ఈ సినిమాలో డిఫరెంట్ పాయింట్. సినిమా అంతా డబ్బు చుట్టే తిరుగుతూ సగటు ప్రేక్షకుడికి బాగానే కనెక్ట్ అవుతుంది. ఓ సాధారణ మధ్య తరగతి వ్యక్తి వేల కోట్ల రూపాయల స్కామ్ ఎలా చేశాడో చూపిస్తూ కథను ఆసక్తికరంగా మలిచారు డైరెక్టర్. నేటి ప్రపంచంలో జరుగుతున్న ఆన్లైన్ మోసాలను, వాటి వల్ల ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను కళ్ళకు కట్టినట్లు చూపించిన విధానం ఆకట్టుకుంది. హాలీవుడ్ రేంజ్ కాకపోయినా విజువల్స్ ఫర్వాలేదనిపించాయి.
మోడ్రన్ కల్చర్, ఫ్యామిలీ రిలేషన్షిప్ లాంటి సన్నివేశాలకు ప్రాధాన్యత ఇస్తూ కథను ముందుకు తీసుకెళ్లారు. ఈ ప్రపంచంలో డబ్బుంటే ఏ పనైనా సులువే అని తెలిపేలా మధ్య మధ్యలో కొన్ని సీన్స్ జొప్పించి కథకు బలం చేకూర్చారు. కమర్షియల్గా కాకుండా కథను రియాలిటీకి దగ్గరగా చూపించే ప్రయత్నం చేశారు. ప్రీ ఇంటర్వెల్ సీన్స్, క్లైమాక్స్ హైలైట్ అయ్యాయి. చిత్రానికి మెయిన్ అట్రాక్షన్ కాజల్ నటన అని చెప్పుకోవచ్చు. మంచి విష్ణు తన పాత్రకు న్యాయం చేశాడు. ఏసీపీ ఆఫీసర్గా సునీల్ శెట్టి రోల్ సినిమాకు ప్లస్ అయింది. వెంకటేష్ వాయిస్ ఓవర్ సినిమాకు మరో అట్రాక్షన్.
ఫైట్స్, సాంగ్స్, కామెడీ లాంటి వాటి జోలికి పోకుండా కేవలం సబ్జెక్ట్తో మాత్రమే సినిమా రన్ చేయడం అనేది అప్పుడప్పుడూ కాస్త బోర్ ఫీలింగ్ తెప్పించింది. నవదీప్, నవీన్ చంద్ర రోల్స్ ఇంపార్టెంట్ అయినప్పటికీ పెద్దగా స్క్రీన్ స్పేస్ ఇవ్వకపోవడం మైనస్ పాయింట్. రొటీన్ కథలకు బిన్నంగా ఉన్న ఈ మూవీలో బ్యాక్గ్రౌండ్ స్కోర్ కాస్త థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ ఇచ్చింది. డబ్బు మాయలో పడ్డ జనాన్ని ఆలోచింపజేసే డైలాగ్స్ ఆకట్టుకున్నాయి. నీతి, నిజాయితీని నమ్ముకొని బ్రతికే ఓ తండ్రికి మోసగాళ్లుగా కోట్లు గడించిన కొడుకు, కూతురును చూసి అసహ్యం వేసి బంగ్లా వదిలి తిరిగి అదే గుడిసెకు చేరుకోవడం ఈ మూవీలో మెయిన్ పాయింట్.ఇండియాలో భారీ స్కామ్స్ చేసిన మోసగాళ్ళు కూడా లగ్జరీ లైఫ్ అనుభవిస్తూ బయట హాయిగా తిరగడం చూపించి ఒకరకంగా ఇండియన్ లా సిస్టంపై సెటైర్ వేశారని చెప్పుకోవచ్చు.
చివరగా..
ప్రతి వ్యక్తి జీవితంలో డబ్బే సుఖం,డబ్బే కష్టం,ఆ డబ్బే లగ్జరీ,ఆ డబ్బే సమస్య అని చెప్పే కథనే ఈ మోసగాళ్ళు.ప్రెష్నెస్ కోరుకునే ఆడియన్స్ తప్పక చూడాల్పిన సినిమా,చూసి ఎంజాయ్ చేసే సినిమా మోసగాళ్లు.
మాగల్ఫ్ రేటింగ్:3/5
తాజా వార్తలు
- తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 3 రెడీ..
- తెలుగు రాష్ట్రాల్లో భానుడి భగభగలు
- హైదారాబాద్ చేరుకున్న ఉపరాష్ట్రపతి..స్వాగతం పలికిన మంత్రి పొన్నం
- ఫార్మా కంపెనీలో భారీ అగ్ని ప్రమాదం..మంటల్లో చిక్కుకున్న దాదాపు 50 మంది కార్మికులు
- ఫోన్ ట్యాపింగ్ కేసులో కొనసాగుతున్న విచారణ: సీపీ శ్రీనివాస్ రెడ్డి
- డ్రైవింగ్ లైసెన్స్ కోసం లంచం.. 8మంది ప్రవాసులకు జైలుశిక్ష
- దుబాయ్ గ్లోబల్ విలేజ్ పొడిగింపు
- బహ్రెయిన్ లో ప్రతి చిన్నారికి నెలకు BD20..!
- ఎగిరే వాహనాల కోసం ‘వెర్టిపోర్ట్’కు ఆమోదం
- ప్రపంచంలోనే అతిపెద్ద యానిమల్ సెంటర్ ప్రారంభం