ఫేస్ మాస్క్ ధరించని 61,051 మందిపై కేసు నమోదు
- March 21, 2021బహ్రెయిన్:కోవిడ్ నిబంధనలు పాటించని వారిపై బహ్రెయిన్ అధికారులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు. భౌతిక దూరం పాటించకపోయినా, ఫేస్ మాస్కులు ధరించకపోయినా వెంటనే వారిపై కేసులు నమోదు చేస్తున్నారు. ఇలా ఇప్పటివరకు బహ్రెయిన్ వ్యాప్తంగా ఫేస్ మాస్కులు పెట్టుకోని 61,051 మందిపై కేసు నమోదు చేశారు. అలాగే భౌతిక దూరం పాటించని 8,579 మందిపై కూడా కేసులు బుక్ చేశారు. కోవిడ్ వ్యాప్తిని నియంత్రించేందుకు ముందస్తు జాగ్రత్తలు పాటించటమే ఉత్తమ మార్గమమని చెబుతున్న అధికారులు కోవిడ్ నిబంధనలపై ప్రజల్లో అవగాహన పెంపొందించేందుకు ముమ్మరంగా ప్రచారాన్ని నిర్వహించింది. ఈ నెల 18 నాటికి 7,023 అవగాహన కార్యక్రమాలను చేపట్టింది. సమాజ ఆరోగ్య భద్రత కోసం ప్రతి ఒక్కరు బాధ్యతగా వ్యవహరించాలని అధికారులు ప్రజలకు సూచించారు.
తాజా వార్తలు
- బెంగళూరు: రేవ్ పార్టీలో తెలుగు రాష్ట్రాలకు చెందిన 100 మంది ప్రముఖలు అరెస్ట్
- సీఎం రేవంత్ ప్రభుత్వం సంచలన నిర్ణయాలు ఇవే..
- లోయలో పడ్డ వాహనం...17 మంది మృతి
- 4వ అంతర్జాతీయ శివపదార్చనగా సాగిన శివపదం పాటల పోటీలు
- సింగపూర్ లో ఘనంగా 'పాట షికారుకొచ్చింది' పుస్తక ఆవిష్కరణ
- హైదరాబాద్లో NATS సహకారంతో కంప్యూటర్ శిక్షణ కేంద్రం ప్రారంభం
- టీఎస్ ఈసెట్ ఫలితాలు విడుదల...
- అండమాన్ను తాకిన నైరుతి రుతుపవనాలు..
- ఇరాన్ అధ్యక్షుడు రైసీ మరణంపై యూఏఈ సంతాపం
- యూఏఈలో 50% వరకు పెరిగిన బీమా ప్రీమియం