హడలెత్తిస్తున్న కుంభమేళా
- March 22, 2021న్యూఢిల్లీ: ఉత్తరాఖండ్లోని హరిద్వార్లో కొనసాగుతున్న కుంభమేళా వల్ల కరోనా వ్యాపిస్తోందని, కట్టడి చేసేందుకు తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా కేంద్ర ప్రభుత్వం.. ఉత్తరాఖండ్ రాష్ట్రానికి లేఖ రాసింది. కుంభమేళాలో క్షేత్రస్థాయి పరిస్థితులను పరిశీలించేందుకు నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్కు చెందిన బృందం కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో హరి ద్వార్లో ఈ నెల 16–17 మధ్య పర్యటించింది.
కుంభమేళా జరిగిన షాహి స్నాన్ రోజుల తర్వాత స్థానికుల్లో ఉన్నట్టుండి కరోనా కేసులు పెరిగాయని తెలిపింది. కుంభమేళాకు కరోనా కేసులు అధికంగా ఉన్న రాష్ట్రాల నుంచి కూడా భక్తులు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో సరైన చర్యలు తీసుకోవాల్సిందిగా సూచించింది. అవసరమైన మేర టెస్టులు చేయాలని, ప్రభుత్వం విడుదల చేసిన కరోనా మార్గదర్శకాలను పాటించాలని చెప్పింది. కొత్త కేసుల్లో వేగం కనిపిస్తే వెంటనే జీనోమ్ సీక్వెన్సింగ్కు శాంపిల్స్ పంపాలని కోరింది.
తాజా వార్తలు
- తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల ఉపసంహరణ గడువు..
- జైపూర్, నాగ్పూర్, గోవా విమానాశ్రయాలకు బాంబు బెదిరింపులు
- రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
- ఖతార్ లో రేపట్నుంచి భారీ వర్షాలు..!
- ఆన్లైన్ పేమెంట్స్ కు రెంటర్స్ ప్రాధాన్యం..!
- కువైట్ నుంచి తగ్గిన ప్రవాసుల రెమిటెన్స్
- యూఏఈలో ఈ వారం భారీ వర్షాలు..!
- సౌదీలో 10% పెరిగిన పర్యాటకుల సంఖ్య
- 250 గంటలపాటు బురదలోనే.. చివరకు సేఫ్..!
- IPLలో చరిత్ర సృష్టించిన ఎంఎస్ ధోని..