హడలెత్తిస్తున్న కుంభమేళా
- March 22, 2021
న్యూఢిల్లీ: ఉత్తరాఖండ్లోని హరిద్వార్లో కొనసాగుతున్న కుంభమేళా వల్ల కరోనా వ్యాపిస్తోందని, కట్టడి చేసేందుకు తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా కేంద్ర ప్రభుత్వం.. ఉత్తరాఖండ్ రాష్ట్రానికి లేఖ రాసింది. కుంభమేళాలో క్షేత్రస్థాయి పరిస్థితులను పరిశీలించేందుకు నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్కు చెందిన బృందం కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో హరి ద్వార్లో ఈ నెల 16–17 మధ్య పర్యటించింది.
కుంభమేళా జరిగిన షాహి స్నాన్ రోజుల తర్వాత స్థానికుల్లో ఉన్నట్టుండి కరోనా కేసులు పెరిగాయని తెలిపింది. కుంభమేళాకు కరోనా కేసులు అధికంగా ఉన్న రాష్ట్రాల నుంచి కూడా భక్తులు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో సరైన చర్యలు తీసుకోవాల్సిందిగా సూచించింది. అవసరమైన మేర టెస్టులు చేయాలని, ప్రభుత్వం విడుదల చేసిన కరోనా మార్గదర్శకాలను పాటించాలని చెప్పింది. కొత్త కేసుల్లో వేగం కనిపిస్తే వెంటనే జీనోమ్ సీక్వెన్సింగ్కు శాంపిల్స్ పంపాలని కోరింది.
తాజా వార్తలు
- దుబాయ్ సీక్రెట్ ఫార్ములా: 17 మంది బిలియనీర్లకు నివాసంగా యూఏఈ..!!
- సెర్న్ తో కీలక ఒప్పందం చేసుకున్న ఒమన్..!!
- కువైట్ లో జూన్ 1 నుంచి ఔట్ డోర్ వర్క్ పై నిషేధం..!!
- 10 ప్రాంతాల్లో 52 'ఈదియా' ఏటీఎంలు: ఖతార్ సెంట్రల్ బ్యాంక్
- హజ్ నిబంధనలు ఉల్లంఘన.. ఏడుగురికి భారీ జరిమానా..!!
- అణు, ప్రాంతీయ భద్రతకు ప్రత్యక్ష ముప్పు..!!
- పుతిన్కు ఘన స్వాగతం పలికిన చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్
- కరెంట్ బిల్లులపై కేంద్రం షాకింగ్ నిర్ణయం..
- ఇక బ్యాంకు ఖాతాలాగే పీఎఫ్ అకౌంట్!
- ఇరాన్ పై దూకుడుకు పెంచిన ట్రంప్..









