కోవిడ్ 19 పీసీఆర్ టెస్ట్ ధర తగ్గింపు
- March 25, 2021
యూఏఈ:కోవిడ్ 19 పీసీఆర్ టెస్ట్ ధరను 65 దిర్హాములకు తగ్గించినట్లు అబుదాబీ డిపార్టుమెంట్ ఆఫ్ హెల్త్ వెల్లడించింది.ప్రస్తుతం నాసల్ స్వాబ్ టెస్ట్ కోసం 85 దిర్హాములు వెచ్చించాల్సి వస్తోంది. శాంపిల్ కలెక్షన్, టెస్టింగ్ కోసం ఈ 65 దిర్హాముల ధరను నిర్ణయించారు.వ్యాక్సినేషన్ చేయించుకోని ఉద్యోగులకు (హోటల్స్, రెస్టారెంట్స్, ట్రాన్స్పోర్టేషన్, అలాగే వైద్య రంగాల్లో పనిచేస్తున్నవారు) ప్రతి 14 రోజులకు ఓ సారి పీసీఆర్ టెస్ట్ చేయాల్సి వుంటుంది. లాండ్రీలు, బ్యూటీ సెలూన్లు వంటి వాటిల్లో పనిచేసేవారికి కూడా ఈ నిబంధన వర్తిస్తుంది. ప్రభుత్వ విభాగాల్లో పనిచేసే ఉద్యోగులు వారానికి ఓ సారి టెస్ట్ చేయించుకోవాలి. దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగంగా జరుగుతుండడంతో కరోనా కేసులు కూడా క్రమంగా తగ్గుతున్నాయి. మరింత వేగంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ చేపట్టి, దేశంలో అందరికీ వ్యాక్సిన్ అందించేందుకు కృషి చేస్తున్నట్లు వైద్య వర్గాలు వెల్లడించాయి.
--సుమన్(మాగల్ఫ్ ప్రతినిధి,యూఏఈ)
తాజా వార్తలు
- ఫోన్ ట్యాపింగ్ కేసులో లీక్స్ పై బీఆర్ఎస్ లీగల్ ఫైట్..!
- అకీరానందన్ పై AI వీడియో.. నిందితుడి అరెస్ట్
- స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు
- మెడికవర్ ఉమెన్ అండ్ చైల్డ్ హాస్పిటల్స్లో అరుదైన అత్యవసర శస్త్రచికిత్స
- 5 నిమిషాల స్కాన్ తో ముందుగానే గుండె జబ్బుల గుర్తింపు..!!
- ఒమన్ లో 31వేల మంది కార్మికుల పై కేసులు నమోదు..!!
- రియాద్ మెట్రోలో మొదటి బేబీ బర్న్..!!
- కువైట్ లో కార్మికశాఖ విస్తృత తనిఖీలు..!!
- ఖతార్ లో స్ట్రాంగ్ విండ్స్, డస్ట్ ఫోర్ కాస్ట్..!!
- ISB యూత్ ఫెస్టివల్..ఓవరాల్ ఛాంపియన్గా ఆర్యభట్ట హౌస్..!!







