కోవిడ్ 19 పీసీఆర్ టెస్ట్ ధర తగ్గింపు
- March 25, 2021
యూఏఈ:కోవిడ్ 19 పీసీఆర్ టెస్ట్ ధరను 65 దిర్హాములకు తగ్గించినట్లు అబుదాబీ డిపార్టుమెంట్ ఆఫ్ హెల్త్ వెల్లడించింది.ప్రస్తుతం నాసల్ స్వాబ్ టెస్ట్ కోసం 85 దిర్హాములు వెచ్చించాల్సి వస్తోంది. శాంపిల్ కలెక్షన్, టెస్టింగ్ కోసం ఈ 65 దిర్హాముల ధరను నిర్ణయించారు.వ్యాక్సినేషన్ చేయించుకోని ఉద్యోగులకు (హోటల్స్, రెస్టారెంట్స్, ట్రాన్స్పోర్టేషన్, అలాగే వైద్య రంగాల్లో పనిచేస్తున్నవారు) ప్రతి 14 రోజులకు ఓ సారి పీసీఆర్ టెస్ట్ చేయాల్సి వుంటుంది. లాండ్రీలు, బ్యూటీ సెలూన్లు వంటి వాటిల్లో పనిచేసేవారికి కూడా ఈ నిబంధన వర్తిస్తుంది. ప్రభుత్వ విభాగాల్లో పనిచేసే ఉద్యోగులు వారానికి ఓ సారి టెస్ట్ చేయించుకోవాలి. దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగంగా జరుగుతుండడంతో కరోనా కేసులు కూడా క్రమంగా తగ్గుతున్నాయి. మరింత వేగంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ చేపట్టి, దేశంలో అందరికీ వ్యాక్సిన్ అందించేందుకు కృషి చేస్తున్నట్లు వైద్య వర్గాలు వెల్లడించాయి.
--సుమన్(మాగల్ఫ్ ప్రతినిధి,యూఏఈ)
తాజా వార్తలు
- ఫేక్ డాక్యుమెంట్లతో సిమ్ తీసుకుంటే జైలే..!!
- నకిలీ ‘కన్స్యూమర్ ప్రొటెక్షన్’ లింక్ల పై దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- కార్వ్ సంస్థకు 4 మిలియన్ డాలర్ల కమిట్మెంట్
- అమరావతిలో మరో ఐకానిక్ నిర్మాణం APNRT టవర్!
- దుబాయ్లో ఎయిర్ ట్యాక్సీలకు గ్రీన్ సిగ్నల్..
- ఖమ్మంలో డీజీపీ సి.వి.ఆనంద్ క్రైమ్ సమీక్ష..'బ్యాక్ టు బేసిక్స్'తో సమర్థ పోలీసింగ్కు పిలుపు
- భారత్ ను చూసి ఇండోనేషియా ఎంతో నేర్చుకోవాలి: ఇండోనేషియా ప్రెసిడెంట్
- పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యం..దక్షిణ కొరియాలో మంత్రి లోకేశ్ బిజీ షెడ్యూల్
- ఖతార్ లో భవిష్యత్ ఉద్యోగ అవసరాలకు అనుగుణంగా స్కాలర్షిప్లు..!!
- ప్యాకేజ్ వీసా.. సౌదీ ప్రయాణం మరింత సులభం..!!







