కోవిడ్ 19 పీసీఆర్ టెస్ట్ ధర తగ్గింపు
- March 25, 2021
యూఏఈ:కోవిడ్ 19 పీసీఆర్ టెస్ట్ ధరను 65 దిర్హాములకు తగ్గించినట్లు అబుదాబీ డిపార్టుమెంట్ ఆఫ్ హెల్త్ వెల్లడించింది.ప్రస్తుతం నాసల్ స్వాబ్ టెస్ట్ కోసం 85 దిర్హాములు వెచ్చించాల్సి వస్తోంది. శాంపిల్ కలెక్షన్, టెస్టింగ్ కోసం ఈ 65 దిర్హాముల ధరను నిర్ణయించారు.వ్యాక్సినేషన్ చేయించుకోని ఉద్యోగులకు (హోటల్స్, రెస్టారెంట్స్, ట్రాన్స్పోర్టేషన్, అలాగే వైద్య రంగాల్లో పనిచేస్తున్నవారు) ప్రతి 14 రోజులకు ఓ సారి పీసీఆర్ టెస్ట్ చేయాల్సి వుంటుంది. లాండ్రీలు, బ్యూటీ సెలూన్లు వంటి వాటిల్లో పనిచేసేవారికి కూడా ఈ నిబంధన వర్తిస్తుంది. ప్రభుత్వ విభాగాల్లో పనిచేసే ఉద్యోగులు వారానికి ఓ సారి టెస్ట్ చేయించుకోవాలి. దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగంగా జరుగుతుండడంతో కరోనా కేసులు కూడా క్రమంగా తగ్గుతున్నాయి. మరింత వేగంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ చేపట్టి, దేశంలో అందరికీ వ్యాక్సిన్ అందించేందుకు కృషి చేస్తున్నట్లు వైద్య వర్గాలు వెల్లడించాయి.
--సుమన్(మాగల్ఫ్ ప్రతినిధి,యూఏఈ)
తాజా వార్తలు
- శిర్డీ సాయి శతాబ్ది మహాస్తూపం వెబ్సైట్ ఆవిష్కరణ
- విద్యార్థులకు కొత్త రూల్ తీసుకొచ్చిన సీఎం రేవంత్
- యూఏఈలో 100కు పైగా ఎస్ఎం అకౌంట్స్ బ్లాక్..!!
- కువైట్ బేలోకి ప్రవేశం నిషేధం..!!
- ప్రజలకు అత్యవసర అలెర్ట్ జారీ చేసిన బహ్రెయిన్..!!
- ఒమన్లో దంచికొడుతున్న ఎండలు..డాక్టర్ల హెచ్చరికలు..!!
- సౌదీ, GCC పౌరులు మే 3 వరకే అవకాశం..!!
- కార్యాలయ భద్రత, అత్యవసర సంసిద్ధత పై పీహెచ్సీసీ ప్రకటన..!!
- తిరుమలకు చేరుకున్న ఉపరాష్ట్రపతి సి.పి.రాధకృష్ణన్
- IPL 2026: ఢిల్లీ పై బెంగళూరు ఘన విజయం









