భారీగా బంగారం బిస్కెట్లు పట్టివేత...
- March 26, 2021ఏ.పీ: కర్నూలు జిల్లాలో 6 కోట్ల 86 లక్షల విలువైన బంగారం పట్టుబడింది. ఆర్టీసీ బస్సులో తరలిస్తుండగా 14 కిలోల 800 గ్రాముల బంగారు బిస్కెట్లను సీజ్ చేశారు పోలీసులు. ఈ ఘటన పంచలింగాల చెక్పోస్ట్ వద్ద చోటుచేసుకుంది. తెలంగాణ నుంచి కర్నూలు వైపు ఆర్టీసీ బస్సు వస్తుండగా సెబ్ అధికారులు తనిఖీలు నిర్వహించారు.రాజు అనే ప్రయాణికుడి సంచిలో బంగారు బిస్కెట్లు గుర్తించారు.అతను అనంతపురం జిల్లా తాడిపత్రిలోని రాయలసీమ బులియన్ కమ్ ట్రేడ్ ప్రైవేట్ లిమిటెడ్ అనే నగల దుకాణంలో పనిచేస్తున్నట్లు గుర్తించారు. యజమాని ఆదేశాల మేరకు హైదరాబాద్లోని ఓ బంగారం దుకాణం నుంచి బంగారు బిస్కెట్లు తెస్తున్నట్లు విచారణలో తేలింది. ఈ బంగారానికి ఎలాంటి బిల్లులు లేకపోవడంతో కేసు నమోదు చేశామన్నారు.
తాజా వార్తలు
- పోలింగ్ రోజు భారీ వర్ష సూచన..అభ్యర్థుల్లో టెన్షన్ టెన్షన్
- భారత యాత్రికులను స్వాగతించిన సౌదీ మంత్రి
- కారు మరమ్మతుల కోసం 2 నెలల నిరీక్షణ..!
- నకిలీ వస్తువుల విక్రయం కేసు.. వ్యాపారి నిర్దోషి
- బిగ్ టికెట్ రాఫిల్.. తదుపరి డ్రా జూన్ 3న
- నకిలీ వెబ్సైట్ల గురించి PACI హెచ్చరిక
- ఇండియాలో చిక్కుకుపోయిన ఒమన్ వాసులు..!
- రాష్ట్రపతి చేతుల మీదుగా పద్మవిభూషణ్ పురస్కారం అందుకున్న మెగాస్టార్ చిరంజీవి
- ఎయిరిండియా సిబ్బంది మూకుమ్మడిగా సెలవు..
- జగన్ విదేశీ పర్యటనకు అనుమతి ఇవ్దొద్దు: కోర్టును కోరిన సీబీఐ