సా.6 గంటల వరకే బస్సు సర్వీసులు..ఎమ్వసలాత్ క్లారిటీ
- March 26, 2021
ఒమన్ : కోవిడ్ వ్యాప్తి నియంత్రణకు నైట్ లాక్డౌన్ విధించనున్నట్లు ఒమన్ సుప్రీం కమిటీ ప్రకటించిన నేపథ్యంలో అందుకు అనుగుణంగా తమ బస్సు, ఫెర్రీస్ సర్వీసుల సమయాలను కూడా కుదిస్తున్నట్లు ఎమ్వసలాత్ స్పష్టం చేసింది. మార్చి 28 నుంచి ఏప్రిల్ 8 వరకు సాయంత్రం 6 గంటల వరకు తమ సర్వీసులు గమ్యస్థానాలకు చేరుకుంటాయని వెల్లడించింది. అందుకు అనుగుణంగా ఇంటర్ సిటీ బస్సు సర్వీసు సమయాలను రీషెడ్యూల్ చేస్తామని వివరించింది. సిటీ బస్సులు మస్కట్, సలాలాలో సాయంత్రం 6 గంటల వరకు అందుబాటులో ఉంటాయని తెలిపింది. రీషెడ్యూల్ చేసిన బస్సు, ఫెర్రీస్ సర్వీసుల సమయాలను పూర్తి వివరాలతో సోషల్ మీడియాలోని తమ అధికారిక ఖాతాల ద్వారా తెలియజేస్తామని ఎమ్వసలాత్ ప్రకటించింది.
తాజా వార్తలు
- ఒమన్లో విషాదం.. ఇంటి బావిలో పడి చిన్నారి మృతి..!!
- భారతీయులకు సౌదీ ‘వీసా ప్యాకేజీ’.. 48 గంటల్లో ఈ-టూరిస్ట్ వీసా..!!
- బహ్రెయిన్లో ప్లాస్టిక్ బ్యాగులపై నిషేధం.. కీలక ఆదేశాలు జారీ..!!
- కువైట్లో రెసిడెన్సీ నిబంధనల ఉల్లంఘన.. కొత్త కేసుల్లో పెరుగుదల..!!
- ఖతార్లో ట్రాఫిక్ జరిమానాలు ఏడాది దాటితే ప్రాసిక్యూషన్ కు రిఫర్..!!
- యూఏఈ-భారత్ విమాన టికెట్ల ధరలు.. 30% వరకు తగ్గింపు..!!
- సీఎం చంద్రబాబు కేబినెట్ భేటీకి డుమ్మా కొట్టిన మంత్రులు
- చరిత్రలో తొలిసారి.. భారత్లో ‘బిగ్ బాష్ లీగ్’ మ్యాచ్..
- గ్లోబల్ 'ఓపెన్ కాల్' ప్రకటించిన ఎమార్
- స్వదేశీ రక్షణ సామర్థ్యాలకు ప్రపంచ స్థాయి గుర్తింపు: మోదీ







