భారీగా బంగారం బిస్కెట్లు పట్టివేత...
- March 26, 2021ఏ.పీ: కర్నూలు జిల్లాలో 6 కోట్ల 86 లక్షల విలువైన బంగారం పట్టుబడింది. ఆర్టీసీ బస్సులో తరలిస్తుండగా 14 కిలోల 800 గ్రాముల బంగారు బిస్కెట్లను సీజ్ చేశారు పోలీసులు. ఈ ఘటన పంచలింగాల చెక్పోస్ట్ వద్ద చోటుచేసుకుంది. తెలంగాణ నుంచి కర్నూలు వైపు ఆర్టీసీ బస్సు వస్తుండగా సెబ్ అధికారులు తనిఖీలు నిర్వహించారు.రాజు అనే ప్రయాణికుడి సంచిలో బంగారు బిస్కెట్లు గుర్తించారు.అతను అనంతపురం జిల్లా తాడిపత్రిలోని రాయలసీమ బులియన్ కమ్ ట్రేడ్ ప్రైవేట్ లిమిటెడ్ అనే నగల దుకాణంలో పనిచేస్తున్నట్లు గుర్తించారు. యజమాని ఆదేశాల మేరకు హైదరాబాద్లోని ఓ బంగారం దుకాణం నుంచి బంగారు బిస్కెట్లు తెస్తున్నట్లు విచారణలో తేలింది. ఈ బంగారానికి ఎలాంటి బిల్లులు లేకపోవడంతో కేసు నమోదు చేశామన్నారు.
తాజా వార్తలు
- 202 మంది బెగ్గర్స్ అరెస్ట్.. విజిట్ వీసా హోల్డర్లే అధికం
- కువైట్ సమాచార శాఖ మంత్రితో భారత రాయబారి భేటీ
- బైట్ అల్ఘాషమ్ దార్అరబ్ ప్రైజ్ కు దరఖాస్తుల ఆహ్వానం
- ఖతార్లో అంతర్జాతీయ నగదు బదిలీపై రుసుములు పెంపు
- పాలస్తీనా భూమి ఆక్రమణ.. తీవ్రంగా ఖండించిన సౌదీ అరేబియా
- పిల్లలకు సోషల్ మీడియా వినియోగం పరిమితం చేయాలా?
- GCC దేశాల కోసం ఇ-వీసాలు.. వ్యాలిడిలీ, డాక్యుమెంట్ ప్రాసెస్
- వార్షిక సౌదీ గ్రీన్ ఇనిషియేటివ్ డే.. లక్ష్యాలను ప్రకటించిన సౌదీ అరేబియా
- అజాన్ లేదా ప్రార్థనల పై తప్పుడు ప్రచారం.. ఖండించిన షార్జా
- విదేశీ కంపెనీలలో పౌరుల నియమకం..ఒమన్ కీలక ఉత్తర్వులు