భారీగా బంగారం బిస్కెట్లు పట్టివేత...
- March 26, 2021
ఏ.పీ: కర్నూలు జిల్లాలో 6 కోట్ల 86 లక్షల విలువైన బంగారం పట్టుబడింది. ఆర్టీసీ బస్సులో తరలిస్తుండగా 14 కిలోల 800 గ్రాముల బంగారు బిస్కెట్లను సీజ్ చేశారు పోలీసులు. ఈ ఘటన పంచలింగాల చెక్పోస్ట్ వద్ద చోటుచేసుకుంది. తెలంగాణ నుంచి కర్నూలు వైపు ఆర్టీసీ బస్సు వస్తుండగా సెబ్ అధికారులు తనిఖీలు నిర్వహించారు.రాజు అనే ప్రయాణికుడి సంచిలో బంగారు బిస్కెట్లు గుర్తించారు.అతను అనంతపురం జిల్లా తాడిపత్రిలోని రాయలసీమ బులియన్ కమ్ ట్రేడ్ ప్రైవేట్ లిమిటెడ్ అనే నగల దుకాణంలో పనిచేస్తున్నట్లు గుర్తించారు. యజమాని ఆదేశాల మేరకు హైదరాబాద్లోని ఓ బంగారం దుకాణం నుంచి బంగారు బిస్కెట్లు తెస్తున్నట్లు విచారణలో తేలింది. ఈ బంగారానికి ఎలాంటి బిల్లులు లేకపోవడంతో కేసు నమోదు చేశామన్నారు.
తాజా వార్తలు
- తెలంగాణతో భాగస్వామ్యానికి గూగుల్ ఆసక్తి
- భారతీయ పారిశ్రామికవేత్తలతో ట్రంప్ సమావేశం
- మీ డ్రైవింగ్ లైసెన్స్లో మొబైల్ నంబర్ను ఆన్లైన్లో ఎలా మార్చాలో తెలుసా?
- పెట్టుబడులకు ఏపీకి మించిన రాష్ట్రం లేదు..దావోస్లో సీఎం చంద్రబాబు
- ఇంటి నుంచే FIR? తెలంగాణ పోలీసుల కొత్త నిర్ణయం
- రియాద్ సీజన్.. 14 మిలియన్లు దాటిన విజిటర్స్..!!
- షార్జాలో పెట్రోల్ స్టేషన్లపై పోలీసుల నిఘా..!!
- ఇండియా నుంచి చేపల దిగుమతికి అనుతించండి..!!
- ఖలీఫా బ్రిడ్జిపై ట్రక్ నిషేధం పొడిగింపు..ట్రాఫిక్ అథారిటీ క్లారిటీ..!!
- కేరళ పౌల్ట్రీ దిగుమతుల పై ఒమన్ నిషేధం..!!







