దుబాయ్ లో షూటింగ్ జరుపుకోనున్న 'ఖిలాడి'
- March 29, 2021దుబాయ్:'క్రాక్' వంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత వస్తున్న రవితేజ చిత్రం 'ఖిలాడి'. రమేశ్ వర్మ దర్శకత్వంలో కోనేరు సత్యనారాయణ నిర్మిస్తున్న ఈ చిత్రం ఇటలీ షెడ్యూల్ పూర్తి చేసుకుంది. నిజానికి ఇటలీలో మరో పాటను చిత్రీకరించాలనుకున్నా లాక్ డౌన్ కారణంగా యూనిట్ ఇండియా వచ్చేసింది. ఐదవ తేదీ నుంచి హైదరాబాద్ లో షూటింగ్ మొదలు పెట్టి మిగిలిన ప్యాచ్ వర్క్ పూర్తి చేయబోతున్నారు. ఇక ఏప్రిల్ 10 నుంచి దుబాయ్ వెళ్ళి అక్కడ పాటతో పాటు మరి కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించటంతో సినిమా మొత్తం పూర్తవుతుంది. ఇందులో మాస్ మహారాజా ద్విపాత్రాభినయం చేస్తుండటం విశేషం. ఇక ఇప్పటికే విడుదలైన 'ఖిలాడి' ఫస్ట్ లుక్ కి మంచి స్పందన వచ్చింది. ఇక రీమేక్స్ చేయటంలో స్పెషలిస్ట్ అయిన రమేశ్ వర్మ ఇప్పటికే కొరియన్ చిత్రాన్ని 'రైడ్' పేరుతో... తమిళ 'రాక్షసన్' చిత్రాన్ని బెల్లంకొండ సాయితో 'రాక్షసుడు'గా తీసి హిట్స్ కొట్టాడు. ఇప్పుడు రవితేజతో తీస్తున్న 'ఖిలాడి' కూడా ఓ తమిళ సినిమాకు రీమేక్ కావటంతో ఈ సినిమా పూర్తి స్థాయిలో బజ్ ఏర్పడింది. ఈ సినిమాను మే 28న విడుదల చేయటానికి దర్శకనిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు.
తాజా వార్తలు
- ఇళ్లకు ఉచితంగా మరమ్మతులు..ముందుకొచ్చిన డెవలపర్లు
- దుబా పోర్ట్లో భారీ డ్రగ్ స్మగ్లింగ్ గుట్టురట్టు
- మిడిల్ ఈస్ట్ వివాదం నివారణకు ఖతార్ పిలుపు
- షార్జాలో అదృశ్యమైన యువకుడు క్షేమం
- అబ్దల్లి కారు ప్రమాదంలో భారతీయ వ్యక్తి మృతి
- ఐక్యరాజ్యసమితి నిర్ణయంపై సర్వత్రా విచారం
- కాషాయ రంగులో దూరదర్శన్ లోగో.. ప్రతిపక్షాల విమర్శలు
- కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్
- 2025 Film Awards : అధికారిక తేదీని వెల్లడించిన BAFTA
- బుల్లెట్ ప్రూఫ్ కారులో కనిపించిన సల్మాన్ ఖాన్