దుబాయ్ లో షూటింగ్ జరుపుకోనున్న 'ఖిలాడి'
- March 29, 2021
దుబాయ్:'క్రాక్' వంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత వస్తున్న రవితేజ చిత్రం 'ఖిలాడి'. రమేశ్ వర్మ దర్శకత్వంలో కోనేరు సత్యనారాయణ నిర్మిస్తున్న ఈ చిత్రం ఇటలీ షెడ్యూల్ పూర్తి చేసుకుంది. నిజానికి ఇటలీలో మరో పాటను చిత్రీకరించాలనుకున్నా లాక్ డౌన్ కారణంగా యూనిట్ ఇండియా వచ్చేసింది. ఐదవ తేదీ నుంచి హైదరాబాద్ లో షూటింగ్ మొదలు పెట్టి మిగిలిన ప్యాచ్ వర్క్ పూర్తి చేయబోతున్నారు. ఇక ఏప్రిల్ 10 నుంచి దుబాయ్ వెళ్ళి అక్కడ పాటతో పాటు మరి కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించటంతో సినిమా మొత్తం పూర్తవుతుంది. ఇందులో మాస్ మహారాజా ద్విపాత్రాభినయం చేస్తుండటం విశేషం. ఇక ఇప్పటికే విడుదలైన 'ఖిలాడి' ఫస్ట్ లుక్ కి మంచి స్పందన వచ్చింది. ఇక రీమేక్స్ చేయటంలో స్పెషలిస్ట్ అయిన రమేశ్ వర్మ ఇప్పటికే కొరియన్ చిత్రాన్ని 'రైడ్' పేరుతో... తమిళ 'రాక్షసన్' చిత్రాన్ని బెల్లంకొండ సాయితో 'రాక్షసుడు'గా తీసి హిట్స్ కొట్టాడు. ఇప్పుడు రవితేజతో తీస్తున్న 'ఖిలాడి' కూడా ఓ తమిళ సినిమాకు రీమేక్ కావటంతో ఈ సినిమా పూర్తి స్థాయిలో బజ్ ఏర్పడింది. ఈ సినిమాను మే 28న విడుదల చేయటానికి దర్శకనిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు.
తాజా వార్తలు
- హోర్ముజ్ జలసంధిలో భారత నౌకల పై దాడి..
- గ్లోబల్ విలేజ్ మళ్లీ సందర్శకులకు స్వాగతం పలకనుంది
- IPL 2026: చెన్నై పై హైదరాబాద్ విజయం
- ‘రన్ ఫర్ ది నేషన్’లో 25 వేల మంది పాల్గొనడంతో ఐక్యతకు ప్రతీక
- స్పైస్జెట్లో భారీ లేఆఫ్స్…500 మందికి షాక్
- హోర్ముజ్, లెబనాన్ సీజ్ ఫైర్ పై అమెరికా, సౌదీ చర్చలు..!!
- ఇరాన్ ఎయిర్ స్పేస్ పాక్షికంగా రీ ఓపెన్..!!
- రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ఇదే అత్యంత తీవ్రమైనది..!!
- జాయెద్ ఎయిర్పోర్ట్..బోర్డింగ్ పాస్ లేకుండానే టెర్మినల్ సౌకర్యాలు పొందే అవకాశం..!!
- సమైల్ గవర్నరేట్లో నడిరోడ్డుపై కారు దగ్ధం..!!









