దుబాయ్ లో షూటింగ్ జరుపుకోనున్న 'ఖిలాడి'
- March 29, 2021దుబాయ్:'క్రాక్' వంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత వస్తున్న రవితేజ చిత్రం 'ఖిలాడి'. రమేశ్ వర్మ దర్శకత్వంలో కోనేరు సత్యనారాయణ నిర్మిస్తున్న ఈ చిత్రం ఇటలీ షెడ్యూల్ పూర్తి చేసుకుంది. నిజానికి ఇటలీలో మరో పాటను చిత్రీకరించాలనుకున్నా లాక్ డౌన్ కారణంగా యూనిట్ ఇండియా వచ్చేసింది. ఐదవ తేదీ నుంచి హైదరాబాద్ లో షూటింగ్ మొదలు పెట్టి మిగిలిన ప్యాచ్ వర్క్ పూర్తి చేయబోతున్నారు. ఇక ఏప్రిల్ 10 నుంచి దుబాయ్ వెళ్ళి అక్కడ పాటతో పాటు మరి కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించటంతో సినిమా మొత్తం పూర్తవుతుంది. ఇందులో మాస్ మహారాజా ద్విపాత్రాభినయం చేస్తుండటం విశేషం. ఇక ఇప్పటికే విడుదలైన 'ఖిలాడి' ఫస్ట్ లుక్ కి మంచి స్పందన వచ్చింది. ఇక రీమేక్స్ చేయటంలో స్పెషలిస్ట్ అయిన రమేశ్ వర్మ ఇప్పటికే కొరియన్ చిత్రాన్ని 'రైడ్' పేరుతో... తమిళ 'రాక్షసన్' చిత్రాన్ని బెల్లంకొండ సాయితో 'రాక్షసుడు'గా తీసి హిట్స్ కొట్టాడు. ఇప్పుడు రవితేజతో తీస్తున్న 'ఖిలాడి' కూడా ఓ తమిళ సినిమాకు రీమేక్ కావటంతో ఈ సినిమా పూర్తి స్థాయిలో బజ్ ఏర్పడింది. ఈ సినిమాను మే 28న విడుదల చేయటానికి దర్శకనిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు.
తాజా వార్తలు
- టోఫెల్ ఇండియా ఛాంపియన్షిప్ను ప్రారంభించిన ఈటిఎస్
- వాట్సప్ లో కొత్త ఫీచర్..
- 7న ప్రత్యక్షంగా కోర్టులో ఎమ్మెల్సీ కవిత ని హాజరుపరచండి
- శంషాబాద్ సమీపంలో 34 కేజీల బంగారం స్వాధీనం
- ఆడబిడ్డకు జన్మనిచ్చిన దుబాయ్ రాయల్ షేఖా మహరా
- 17 ఏళ్ల బాలుడు మిస్సింగ్ కేసు విషాదాంతం
- 123 మంది కార్మికుల పై బహిష్కరణ వేటు
- భారత ప్రవాసుల కోసం 'ఓపెన్ హౌస్'
- స్విఫ్ట్ స్టూడెంట్ ఛాలెంజ్.. 'మై చైల్డ్' యాప్ కు ప్రశంసలు
- ఇకపై 'వ్యాక్సినేషన్ స్టేటస్' ఉండదు..!