దుబాయ్ లో షూటింగ్ జరుపుకోనున్న 'ఖిలాడి'
- March 29, 2021దుబాయ్:'క్రాక్' వంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత వస్తున్న రవితేజ చిత్రం 'ఖిలాడి'. రమేశ్ వర్మ దర్శకత్వంలో కోనేరు సత్యనారాయణ నిర్మిస్తున్న ఈ చిత్రం ఇటలీ షెడ్యూల్ పూర్తి చేసుకుంది. నిజానికి ఇటలీలో మరో పాటను చిత్రీకరించాలనుకున్నా లాక్ డౌన్ కారణంగా యూనిట్ ఇండియా వచ్చేసింది. ఐదవ తేదీ నుంచి హైదరాబాద్ లో షూటింగ్ మొదలు పెట్టి మిగిలిన ప్యాచ్ వర్క్ పూర్తి చేయబోతున్నారు. ఇక ఏప్రిల్ 10 నుంచి దుబాయ్ వెళ్ళి అక్కడ పాటతో పాటు మరి కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించటంతో సినిమా మొత్తం పూర్తవుతుంది. ఇందులో మాస్ మహారాజా ద్విపాత్రాభినయం చేస్తుండటం విశేషం. ఇక ఇప్పటికే విడుదలైన 'ఖిలాడి' ఫస్ట్ లుక్ కి మంచి స్పందన వచ్చింది. ఇక రీమేక్స్ చేయటంలో స్పెషలిస్ట్ అయిన రమేశ్ వర్మ ఇప్పటికే కొరియన్ చిత్రాన్ని 'రైడ్' పేరుతో... తమిళ 'రాక్షసన్' చిత్రాన్ని బెల్లంకొండ సాయితో 'రాక్షసుడు'గా తీసి హిట్స్ కొట్టాడు. ఇప్పుడు రవితేజతో తీస్తున్న 'ఖిలాడి' కూడా ఓ తమిళ సినిమాకు రీమేక్ కావటంతో ఈ సినిమా పూర్తి స్థాయిలో బజ్ ఏర్పడింది. ఈ సినిమాను మే 28న విడుదల చేయటానికి దర్శకనిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు.
తాజా వార్తలు
- దుబాయ్ కి పంపుతానని చెప్పి ఘరానా మోసం చేసిన ఏజెంట్
- ఏపీలో ఎన్నికల హింస పై 13 మందితో సిట్ ఏర్పాటు..
- అమ్మ ఆదర్శ పాఠశాల, వరి ధాన్యం కొనుగోళ్ల పై కీలక ఆదేశాలు జారీ
- ఖతార్లోని మ్యూజియమ్స్.. ఫ్రీ ఎంట్రీ
- చెక్స్ బౌన్స్. పరిహారంగా BD64,000
- 'అబ్షర్' ద్వారా యాక్సిడెంట్ రిపోర్టింగ్, వెహికల్ బదిలీ
- ఒమన్లో కొన్ని బ్యాంకు నోట్లు త్వరలోఉపసంహరణ..!
- ఆన్లైన్లో వస్తువులను విక్రయిస్తున్నారా? పోలీసుల హెచ్చరిక
- 1,300 కంపెనీలకు Dh100,000 జరిమానా..!
- IIT ఢిల్లీ–అబుధాబి.. ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల