కరోనా కేసుల పెరుగుదలతో మక్కా, మదీనాలో బఫెట్స్ సర్వీసుల నిలిపివేత
- April 01, 2021
సౌదీ అరేబియా: పవిత్ర రమదాన్ మాసంలో సంప్రదాయ బద్ధంగా జరిగే బఫెట్ సర్వీసులను రెస్టారెంట్లలో నిలిపివేస్తూ అథారిటీస్ నిర్ణయం తీసుకున్నాయి. కరోనా వైరస్ కేసులు పెరుగుతున్న దరిమిలా ఈ నిర్ణయం తీసుకున్నారు. మక్కా మునిసిపాలిటీ అధికార ప్రతినిథి రాద్ అల్ షరీఫ్ మాట్లాడుతూ, ఓపెన్ బఫెట్ సర్వీసులు (రెస్టారెంట్లలో) అలాగే బహిరంగ ప్రదేశాల్లో జరిగే ఫుడ్ బాంకెట్స్ కూడా సస్పెండ్ చేయడం జరిగిందని చెప్పారు. రెస్టారెంట్లు నిబంధనలు పాటిస్తున్నాయా.? లేదా.? అన్నదానిపై ఎప్పటికప్పుడు తనిఖీలు జరుగుతాయని వివిరంచారు. మరోపక్క మదీనాలో కూడా అథారిటీస్ ఇవే నిర్ణయాల్ని అమల్లోకి తెచ్చారు. రమదాన్ నేపథ్యంలో స్టోర్లు రోజంతా పనిచేసేలా చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. కరోనా నిబంధనల్ని పాటించడం తప్పనిసరి.
తాజా వార్తలు
- టాప్ 10 గ్లోబల్ రెవెన్యూ కంపెనీలు వెల్లడి
- భారత్-మలేసియాల మధ్య పలు ఒప్పందాల పై సంతకాలు
- భారత భాషల కోసం ప్రత్యేక AI విప్లవం
- నేటి నుంచి గుణదల మేరీమాత ఉత్సవాలు
- ఖతార్ లో వెయ్యి వస్తువుల ధరలు తగ్గింపు..!!
- మస్కట్ లో INSV కౌండిన్యకు ఘనంగా వీడ్కోలు..!!
- 2025లో సౌదీలో రెమిటెన్స్ రికార్డు..15శాతం వృద్ధి..!!
- ట్రాఫిక్ కు చెక్..అల్ ఖుద్రాలో కొత్త 4-లేన్ల బ్రిడ్జి ప్రారంభం..!!
- సల్మానియా మెడికల్ కాంప్లెక్స్లో అగ్నిప్రమాదం..తప్పిన పెనుప్రమాదం..!!
- ఫహాహీల్ ఎక్స్ ప్రెస్వే ఫాస్ట్ లేన్ 15 రోజుల పాటు మూసివేత..!!









