వలసదారులకు సేవల ముగింపు తర్వాత జరిగే చెల్లింపుల నిలిపివేత
- April 01, 2021కువైట్ సిటీ: సేవల ముగింపు తర్వాత జరిగే చెల్లింపులు వలసదారులకు అందాలంటే, రెసిడెన్సీ రద్దు చేసుకుని, దేశం విడిచి వెళుతున్నట్లుగా నిర్ధారణ పత్రాలు చూపించాల్సి వుంటుంది. ఈ మేరకు సంబంధిత అథారిటీస్ స్పష్టతనిచ్చాయి. నాన్ కువైటీ ఉద్యోగి, తన విధుల నుంచి తప్పుకుని, వేరే చోట విధుల్లో చేరితే, అలాంటివారికి సేవల ముగింపు తర్వాత వచ్చే చెల్లింపులు ఆపివేయబడతాయి. శాశ్వతంగా దేశం విడిచి వెళ్ళే వరకు ఆ నిధులు రిజర్వ్ చేయబడతాయి. కువైటైజేషన్ విషయమై కొన్ని వెసులుబాట్లు కోరుతూ వస్తున్న అభ్యర్థనల్ని సి.ఎస్.సి. తోసిపుచ్చింది. మెడికల్ స్పెషాలిటీస్, కొన్ని టీచింగ్ స్పెషాలిటీస్ తప్ప మిగతా చోట్ల వలసదారుల అవసరంలేదని సంబంధిత వర్గాలు తెలిపాయి.
--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)
తాజా వార్తలు
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ
- కేరళలో హెపటైటిస్ కలకలం..12 మంది మృతి