వలసదారులకు సేవల ముగింపు తర్వాత జరిగే చెల్లింపుల నిలిపివేత
- April 01, 2021
కువైట్ సిటీ: సేవల ముగింపు తర్వాత జరిగే చెల్లింపులు వలసదారులకు అందాలంటే, రెసిడెన్సీ రద్దు చేసుకుని, దేశం విడిచి వెళుతున్నట్లుగా నిర్ధారణ పత్రాలు చూపించాల్సి వుంటుంది. ఈ మేరకు సంబంధిత అథారిటీస్ స్పష్టతనిచ్చాయి. నాన్ కువైటీ ఉద్యోగి, తన విధుల నుంచి తప్పుకుని, వేరే చోట విధుల్లో చేరితే, అలాంటివారికి సేవల ముగింపు తర్వాత వచ్చే చెల్లింపులు ఆపివేయబడతాయి. శాశ్వతంగా దేశం విడిచి వెళ్ళే వరకు ఆ నిధులు రిజర్వ్ చేయబడతాయి. కువైటైజేషన్ విషయమై కొన్ని వెసులుబాట్లు కోరుతూ వస్తున్న అభ్యర్థనల్ని సి.ఎస్.సి. తోసిపుచ్చింది. మెడికల్ స్పెషాలిటీస్, కొన్ని టీచింగ్ స్పెషాలిటీస్ తప్ప మిగతా చోట్ల వలసదారుల అవసరంలేదని సంబంధిత వర్గాలు తెలిపాయి.
--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)
తాజా వార్తలు
- ప్రజల తరపున ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నారు: కేటీఆర్
- 27 భాషల్లో యూట్యూబ్ వీడియోలు
- ఏపీలో మరో ప్రతిష్టాత్మక సంస్థ
- ఉగ్రవాదం పై రాజీ లేదు: ప్రధాని మోదీ
- కొత్త IT చట్టం రూల్స్
- బూతు రాజకీయాలు, పోలింగ్ బూత్లోనే సమాధానం: వెంకయ్య నాయుడు
- 'WTF' ఆధ్వర్యంలో ఉచిత తెలుగు తరగతులు ప్రారంభం
- ఒమన్లో 8 మిలియన్లు దాటిన మొబైల్ సర్వీస్ సబ్స్క్రిప్షన్లు..!!
- బహ్రెయిన్ -యూఏఈ మధ్య వ్యూహాత్మక ఆర్థిక చర్చలు..!!
- ప్రైవేట్ వాహనాలను టాక్సీలుగా ఉపయోగించడంపై ఖతార్ హెచ్చరిక..!!









