గుడ్ ఫ్రైడే..
- April 02, 2021గుడ్ ఫ్రైడే.. క్రైస్తవులు ఎంతో పవిత్రంగా భావించే రోజు.ఏసుక్రీస్తు..శుక్రవారం సిలువ చేయబడ్డారు.కల్వరి వద్ద ఆయన మరణం తాలుకా జ్ఞాపకాలను క్రైస్తవ విశ్వాసకులకు గుర్తుచేసుకునే రోజు ఇది.
భూమిపై అవతరించిన దైవ కుమారుడు ఏసుక్రీస్తుకు కల్వరిగిరిపై శిలువచేసిన రోజు గుడ్ ఫ్రైడే. కల్వరి వద్ద ఆయన మరణం తాలుకా జ్ఞాపకాలను క్రైస్తవ విశ్వాసకులకు గుర్తుచేసుకునే రోజు ఇది. పవిత్ర వారంలోని మూడు రోజులలో భాగంగా ఈస్టర్కు ముందు వచ్చే శుక్రవారాన్ని క్రైస్తవులు గుడ్ ఫ్రైడేను జరుపుకుంటారు. దీనిని హోలీ ఫ్రైడే, బ్లాక్ ఫ్రైడే, గ్రేట్ ఫ్రైడే అని కూడా పిలుస్తారు. సువార్తల ఆధారంగా క్రీస్తును శిలువ చెయడం దాదాపుగా శుక్రవారమే జరిగింది.లోకానికి శాంతి దూతగా వచ్చిన యేసుక్రీస్తును రెండువేల ఏళ్లక్రితం ఇదే శుక్రవారం కల్వరి గిరిపై క్రీస్తును శిలువ చేశారు.పాదాలు, చేతుల్లోకి మేకులు దించిన సమయంలో రక్తమోడుతున్న దేహంతో క్రీస్తూ ఇలా ప్రార్థించారు.
‘దేవా! నా దేవా....నన్నెందుకు చేయివిడిచావు! అంటూ క్రీస్తు ఆర్తనాదాలు నింగి వరకు ప్రతిధ్వనించాయి. వీళ్లు చేస్తున్నందేంటో వీరికి తెలియదు కాబట్టి వీరిని క్షమించు’ అని ప్రార్థించారు. మానవాళి పాప ప్రక్షాళన కోసం ప్రాణాన్ని విడిచి మరణాన్ని ఓడించారు క్రీస్తు అని బైబిల్లొ పేర్కొన్నారు. అందుకే ఈ రోజును గుడ్ ఫ్రైడే, గ్రేట్ ఫ్రైడేగా క్రైస్తవులు జరుపుకుంటారు. ఈ రోజున క్రైస్తవులు చర్చిలకు వెళ్ళి ఏసు ప్రభువును ఇలా ప్రార్థిస్తారు. క్రిస్మస్ తర్వాత క్రీస్తు పేరిట ప్రార్థనలు, ప్రాయశ్చిత్తం, ఉపవాసాలను పాటిస్తారు. ఇవి ‘ఈస్ట్ వెడ్నెస్డే’ నుంచి ప్రారంభమై గుడ్ ఫ్రైడే రోజున పరిసమాప్తమవుతుంది. దీనినే లెంట్ అని అంటారు.
ఇదే రోజున క్రీస్తును శిలువ చేశారు కాబట్టి దీనికి గుర్తుగా క్రైస్తవులను శిలువను చర్చిలలో ఉంచి ప్రార్థిస్తారు. ప్రతి ఒక్కళ్లూ వచ్చి ఆ శిలువను ముద్దాడుతారు.తర్వాత మధ్యాహ్నం నుంచి మూడు గంటలవరకు సేవలుంటాయి.ఈ సమయంలో క్రీస్తు సిద్ధాంతాల నుంచి ఏదో ఒక దానిని చదివి భక్తులకు వినిపించి వారిచేతకూడా చదివిస్తారు. ఆ తర్వాత చర్చిలలో ప్రవచనాలు, ధ్యానం, ప్రార్థనలు జరుగుతాయి. ఈ సందర్భంగా క్రీస్తును ఎలా శిలువ చేసేరనేదానిపై మత పెద్దలు ఉపన్యాసం చేసి క్రీస్తును స్మరించుకుంటారు. తర్వాత అర్థరాత్రికి సాధారణ కమ్యూనియన్ సర్వీస్ ఉంటుంది. అంటే సామూహిక ప్రార్థనలలో క్రీస్తు స్మృతిపథాన్ని గుర్తు చేసుకుంటారు.
కొన్నిచోట్ల నల్లటి వస్త్రాలు ధరించి భక్తులు క్రీస్తును స్మరిస్తూ ఒక సమారోహాన్ని ఏర్పాటు చేసి, కృత్రిమ అంతిమ సంస్కారాలు కూడా నిర్వహిస్తారు. క్రైస్తవ ధర్మాన్ని పాటించేవారు గుడ్ ఫ్రైడే రోజున ప్రాయశ్చిత్తం, ప్రార్థనలు చేసుకునే రోజు. ముఖ్యంగా ఈ రోజు చర్చిలలో గంటలు మోగవు. కాథలిక్ చర్చి గుడ్ ఫ్రైడేను ఒక ఉపవాస దినంగా పరిగణించింది. ఇది చర్చి లాటిన్ మతవిశ్వాసాలలో కేవలం తేలికైన ఆహారం తీసుకోబడుతుందని చెప్పబడింది. గుడ్ ఫ్రైడే నిర్వహించిన దేశాల్లో మధ్యాహ్నం 3 నుంచి కొన్ని గంటల వరకు మధ్యాహ్నపు సామూహిక ప్రార్థనా సేవ నిలిపివేస్తారు.
--రాజ్ కుమార్ వనంబత్తిన(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)
తాజా వార్తలు
- ఏప్రిల్ లో 20 వేల మందిని తీసేసిన టెక్ దిగ్గజాలు..!
- ఏపీ: ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్..
- రాజస్థాన్ రాయల్స్ పై సన్ రైజర్స్ దే విజయం
- నీట్ యూజీ 2024 ఎంట్రన్స్ ఎగ్జామ్ అడ్మిట్ కార్డ్లు విడుదల..
- టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సన్రైజర్స్ హైదరాబాద్
- టీఎస్ఆర్టీసీ ఎండీతో బ్రిటిష్ డిప్యూటీ హైకమిషనర్ భేటీ
- ఏపీలో 46,389 పోలింగ్ కేంద్రాలు..
- యూఏఈలో అనేక విమానాలు దారి మళ్లింపు, రద్దు
- AI సహాయంతో విద్యార్థుల ప్రొగ్రెస్ ట్రాక్..!
- సౌదీలో మహిళలకు డ్రైవింగ్ లైసెన్స్..!