ఘోర రైలు ప్రమాదం..36 మంది మృతి

- April 02, 2021 , by Maagulf
ఘోర రైలు ప్రమాదం..36 మంది మృతి

టైవాన్:టైవాన్లో ఘోర రైలు ప్రమాదం చోటు చేసుకుంది. శుక్రవారం తెల్లవారుజామున రైలు పట్టాలు తప్పి సొరంగ మార్గాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 36 మంది వరకు మృతి చెందినట్లు తెలుస్తోంది. అలాగే 72 వరకు గాయపడినట్లు రవాణా మంత్రిత్వశాఖ తెలిపింది.విషయం తెలుసుకున్న రైల్వే అధికారులు హుటాహుటిన సిబ్బందితో ఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. కొందరు రైలులో చిక్కుకోవడంతో వారిని బయటకు తీసేందుకు తీవ్రంగా శ్రమించాల్సి వచ్చిందని అధికారులు తెలిపారు.కాగా, గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రులకు తరలిస్తున్నారు.ఈ రైలులో 350 వరకు ఉన్నారు.ఘటన స్థలానికి అగ్నిమాపక సిబ్బంది, రెస్య్కూ టీమ్‌ సిబ్బంది చేరుకుని సహాయక చర్యలు ముమ్మరం చేశారు. ఈ ప్రమాదంలో రైలు బోగీలు తీవ్రంగా దెబ్బతిన్నట్లు తెలుస్తోంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com