వ్యాట్ జోడింపు: ధరలు పెంచొద్దని పంపిణీదారులకు హెచ్చరిక

- April 02, 2021 , by Maagulf
వ్యాట్ జోడింపు: ధరలు పెంచొద్దని పంపిణీదారులకు హెచ్చరిక

మస్కట్: కన్స్యుమర్ ప్రొటెక్షన్ అథారిటీ, పంపిణీదారులందరికీ హెచ్చరిక జారీ చేసింది. వ్యాట్ పెంపు ద్వారా అదనంగా ఆయా వస్తువుల ధర పెంచకూడదని హెచ్చరికలో పేర్కొంది. ఏప్రిల్ 16 నుంచి వ్యాట్ అమల్లోకి రానున్న సంగతి తెలిసిందే. ఏప్రిల్ 16 కంటే ముందే ధరలు పెంచితే, అలాంటివారిపై కఠినమైన చర్యలు తీసుకోవాల్సి వస్తుందని కన్స్యుమర్ ప్రొటెక్షన్ అథారిటీ అల్టిమేటం జారీ చేసింది. ధరల పెంపును వినియోగదారులెవరైనా గుర్తిస్తే, వెంటనే ఫిర్యాదు చేయవచ్చునని కూడా పేర్కొంది అథారిటీ.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com