గల్ఫ్ దేశాల్లోని ఎన్నారైల వేతనాలపై పన్ను మినహాయింపు:నిర్మలా సీతరామన్
- April 02, 2021
న్యూఢిల్లీ: గల్ఫ్ దేశాల్లో ఎన్నారైలు, భారత ప్రవాసులు ఆర్జించే వేతనాలపై పన్ను మినహాయింపు కొనసాగుతుందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతరామన్ గురువారం వెల్లడించారు. ఫైనాన్స్ యాక్ట్ 2021లో గల్ఫ్లోని ఎన్నారైలకు పన్నుల విషయంలో ఎలాంటి వెసులుబాటు కల్పించారో స్పష్టంగా లేదంటూ తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మొయిత్రా ట్వీట్ చేశారు. దీనిపై స్పందించిన ఆర్థిక మంత్రి.. సౌదీ అరేబియా, యూఏఈ, ఒమన్, ఖతార్ దేశాల్లో ఎన్నారైలు ఆర్జించిన వేతనాలపై ఎలాంటి పన్ను విధించడం లేదని సమాధానం ఇచ్చారు. గల్ఫ్ దేశాల్లోని ఎన్నారైల వేతనాలపై భారత్లో పన్ను మినహాయింపు కొనసాగుతుందని మంత్రి స్పష్టం చేశారు.
తాజా వార్తలు
- ఒమన్లో విషాదం.. ఇంటి బావిలో పడి చిన్నారి మృతి..!!
- భారతీయులకు సౌదీ ‘వీసా ప్యాకేజీ’.. 48 గంటల్లో ఈ-టూరిస్ట్ వీసా..!!
- బహ్రెయిన్లో ప్లాస్టిక్ బ్యాగులపై నిషేధం.. కీలక ఆదేశాలు జారీ..!!
- కువైట్లో రెసిడెన్సీ నిబంధనల ఉల్లంఘన.. కొత్త కేసుల్లో పెరుగుదల..!!
- ఖతార్లో ట్రాఫిక్ జరిమానాలు ఏడాది దాటితే ప్రాసిక్యూషన్ కు రిఫర్..!!
- యూఏఈ-భారత్ విమాన టికెట్ల ధరలు.. 30% వరకు తగ్గింపు..!!
- సీఎం చంద్రబాబు కేబినెట్ భేటీకి డుమ్మా కొట్టిన మంత్రులు
- చరిత్రలో తొలిసారి.. భారత్లో ‘బిగ్ బాష్ లీగ్’ మ్యాచ్..
- గ్లోబల్ 'ఓపెన్ కాల్' ప్రకటించిన ఎమార్
- స్వదేశీ రక్షణ సామర్థ్యాలకు ప్రపంచ స్థాయి గుర్తింపు: మోదీ







