రమదాన్ ఆఖరి పది రోజులూ పూర్తి కర్ఫ్యూ?
- April 03, 2021
కువైట్ సిటీ: పవిత్ర రమదాన్ మాసంలో పాక్షిక కర్ఫ్యూ కాస్తా, పూర్తిస్థాయి కర్ఫ్యూ పరిస్థితులకు దారి తీసినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదనే సంకేతాలు వ్యక్తమవుతున్నాయి. రమదాన్ ఆఖరి పది రోజులు పూర్తిస్థాయి కర్ఫ్యూ అవసరమైతే విధించడానికి వీలుగా క్యాబినెట్ ముందు ఓ ప్రతిపాదనను హెల్త్ అథారిటీస్ వుంచినట్లు ఉన్నతస్థాయి ప్రభుత్వ అధికారి ఒకరు చెప్పారు. ఒకవేళ అనూహ్యమైన స్థాయిలో కరోనా పాజిటివ్ కేసులు, మరణాలు పెరిగితే పూర్తి కర్ఫ్యూ విధించక తప్పని పరిస్థితి ఏర్పడుతుందని సదరు అధికారి పేర్కొన్నారు. పాక్షిక బ్యాన్ ఏప్రిల్ 22 వరకు కొనసాగుతుంది.. ఇటీవల విడుదలైన అధికారిక ప్రకటన ప్రకారం. ఎప్పటికప్పుడు పరిస్థితుల్ని అంచనా వేసి, విశ్లేషించి, అవసరమైన మేర కఠిన నిర్ణయాలు తప్పకపోవచ్చని అథారిటీస్ భావిస్తున్నాయి. ప్రతి ఒక్కరూ విధిగా ఫేస్ మాస్క్ ధరించడం, ఫిజికల్ డిస్టెన్సింగ్ పాటించడం, ఎక్కువగా గూమికూడకపోవడం చేస్తే.. కరోనా వ్యాప్తిని అరికట్టవచ్చు.
తాజా వార్తలు
- ఫైనల్ కి చేరుకున్న భారత్
- భారీ డిస్కౌంట్లు ప్రకటించిన ఎయిర్ ఇండియా
- లగ్జరీ కార్లకు కేరాఫ్ అడ్రస్గా రాయ్..అంతిమ యాత్రలోనూ దర్శనం
- బెలూన్స్ పేలి ఇద్దరికి గాయాలు
- తెలంగాణలో గృహాలకు ఫ్రీగా విద్యుత్ కనెక్షన్లు
- తెలంగాణ: మార్చి నెల 19న గద్దర్ అవార్డుల ప్రదానోత్సవం
- మూడేళ్లలో వచ్చేది తమ ప్రభుత్వమే ! ధీమా వ్యక్తం చేసిన జగన్
- ఢిల్లీలో 15 రోజుల్లో 807 మంది అదృశ్యం
- ఖతార్ రాజధాని దోహాలో మంత్రి నారాయణ బృందం పర్యటన
- ఖతార్ లో క్లాస్రూమ్ రీడింగ్ బ్యాగ్ ప్రాజెక్ట్..!!







