శ్రీవారి భక్తులకు శుభవార్త...
- April 03, 2021
తిరుమల:తిరుమలకు వెళ్లే భక్తులకు టీటీడీ శుభవార్త చెప్పింది. గదుల కోసం ఇకపై కళ్లుకాయలు కాచేలా చూసే అవసరం భక్తులకు లేదు. ఈ విషయాన్ని ‘డయల్ యువర్ ఈవో’ కార్యక్రమంలో ఈవో జవహర్ రెడ్డి తెలిపారు.ఆన్లైన్లో గదులు ముందుగా బుకింగ్ చేసుకున్న భక్తులు ప్రస్తుతం తిరుమలలోని సీఆర్వో ఆఫీసుకు వెళ్లి అక్కడి నుంచి సబ్ఎంక్వైరీ కార్యాలయానికి చేరుకుని గదులు పొందుతున్నారు.ఈ ప్రక్రియ కోసం భక్తులు ఎక్కువ సమయం వెచ్చించాల్సి వస్తుంది . అందుకే ఈ పద్దతిలో మార్పులు చేయాలని నిర్ణయించామన్నారు.
తిరుమలకు వచ్చే భక్తులు టికెట్లు అలిపిరి చెక్ పాయింట్ వద్ద స్కాన్ చేసిన వెంటనే మెసేజ్ ద్వారా మొబైల్ నంబర్లకు సబ్ ఎంక్వైరీ ఆఫీసు వివరాలు తెలియజేస్తామన్నారు. భక్తులు నేరుగా ఆ కార్యాలయానికి వెళ్లి గదులు పొందవచ్చని చెప్పారు. మరో పది రోజుల్లో ఈ విధానం అందుబాటులోకి తీసుకొస్తామన్నారు ఈవో. ఆన్లైన్లో రూ.300 ప్రత్యేక ప్రవేశదర్శనం టికెట్లు తీసుకునే భక్తులు అదే స్క్రీన్పై గదులను బుక్ చేసుకునే విధంగా తిరుమల తిరుపతి దేవస్థానం వెబ్సైట్లో మార్పులు తీసుకువస్తామని తెలిపారు.
తిరుమల వెంకన్న సన్నిధిలో ఈనెల 13న శ్రీ ప్లవనామ సంవత్సర ఉగాది పర్వదినాన్ని ఘనంగా నిర్వహిస్తామన్నారు ఈవో. ఈ నెల 24 నుంచి 26 వరకు తిరుమల వసంత మండపంలో స్వామివారి సాలకట్ల వసంతోత్సవాలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు.
తాజా వార్తలు
- హైదరాబాద్ ఎయిర్పోర్ట్కు మరో అంతర్జాతీయ అవార్డు
- దమ్మామ్–రియాద్ ఎక్స్ప్రెస్వే విస్తరణకు శ్రీకారం..
- దుబాయ్ పోలీసుల 'షేడ్ అండ్ రివార్డ్' కార్యక్రమం నాలుగో వారానికి చేరిక..
- టీజీ-20 ట్రెండ్ సెట్టర్.. తెలంగాణ క్రికెట్కు కొత్త బ్రాండ్!
- ఇరాన్ క్షిపణి, డ్రోన్ దాడులను తిప్పికొట్టిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యుద్ధ ప్రభావం నుంచి కోలుకుంటున్న బహ్రెయిన్ దిగుమతులు..!!
- ఫాదర్ అమీర్ షేక్ హమద్ మృతిపై ప్రపంచ దేశాల సంతాపం..!!
- ఒమన్ ఆహార భద్రతకు కీలకంగా అల్ ధాహిరా పురోగతి..!!
- హోర్ముజ్ జలసంధి భద్రతపై సౌదీ విదేశాంగ మంత్రి చర్చలు..!!
- బార్డర్ పోస్టులు, సముద్ర చమురు ప్లాట్ఫామ్కు నష్టం: కువైట్







