ఖైదీలకు ప్రత్యమ్నాయ పెనాల్టీ

- April 03, 2021 , by Maagulf
ఖైదీలకు ప్రత్యమ్నాయ పెనాల్టీ

బహ్రెయిన్: ఇంటీరియర్ మినిస్ట్రీ - సెంటెన్స్ ఎగ్జిక్యూషన్ డైరెక్టరీ నుంచి పబ్లిక్ ప్రాసిక్యూషన్‌కి ఓ ప్రటిపాదన అందింది. ఈ ప్రతిపాదన ప్రకారం, ఖైదీలు ఎవరైతే చట్టపరమైన పరిమితులకు లోబడి అర్హత పొందుతారో, వారికి జైలు శిక్ష నుంచి కాస్త ఉపశమనం కల్పిస్తారు. మొత్తం 126 మంది మహిళ అలాగే పురుష ఖైదీలకు ఈ మేరకు వెసులుబాటు కలగనుంది. సంబందిత న్యాయమూర్తి, ఆయా ఖైదీల జైలు శిక్షకు సరిసమానంగా జరీమానా విధించి, జైలు శిక్షను రద్దు చేసేందుకు అవకాశముంది. కాగా, ఇప్పటిదాకా 3,224 మందికి ఈ తరహా ప్రత్యామ్నాయ అవకాశం లభించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com