గల్ఫ్ గడ్డపై కరోనాతో ప్రాణాలు కోల్పోయిన తెలంగాణ వాసి...అక్కడే అంత్యక్రియలు

- April 04, 2021 , by Maagulf
గల్ఫ్ గడ్డపై కరోనాతో ప్రాణాలు కోల్పోయిన తెలంగాణ వాసి...అక్కడే అంత్యక్రియలు

ఒమన్: రాజన్న సిరిసిల్ల జిల్లా మారుపాక గ్రామానికి చెందిన పడిగేల కృష్ణ అనే యువకుడు గత ఐదు సంవత్సరాలుగా ఒమాన్ లో క్లీనింగ్ కంపెనీలో పనిచేస్తున్నాడు. వచ్చే నెలలో సెలవు పై వెళ్ళడానికి అన్ని సమకూర్చుకున్నాడు.ఇంతలో ఆరోగ్యం క్షీణించడం తో ఆసుపత్రిలో చేర్చారు. వైద్యులు కరోనా గా నిర్ధారించడం తో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మార్చ్ 28 న చనిపోగా మృతదేహాన్ని ఇండియా పంపడానికి వీలుకాకపోవడం తో సదరు కంపనీ యజమాన్యం ఒమన్ తెలంగాణ ఫ్రెండ్స్ అధ్యక్షులు నరేంద్ర పన్నీరు సంప్రదించగా వారు తమ బృందం తో అంత్యక్రియలు నిర్వహించారు.ఈ సందర్భంగా నరేంద్ర వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని ప్రకటిస్తూ మృతినికి సంబంధించిన పెండింగ్ బకాయిలు ఏమైనా ఉంటే కంపనీ తో మాట్లాడి అతని కుటుంబానికి అందేలా చూస్తానని తెలియజేసారు. ఈ అంత్యక్రియల్లో ఉపాధ్యక్షులు మంచికట్ల కుమార్, కార్యదర్శి మామిడి శ్యాం, సభ్యులు పూదరి వెంకట్రాజులు పాల్గొన్నారు.

--లెనిన్ కుమార్(మాగల్ఫ్ ప్రతినిధి,ఒమన్)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com