జీతం ఇవ్వలేదని, షాప్ తగలబెట్టిన వ్యక్తి, 1 మిలియన్ దిర్హాముల నష్టం
- April 05, 2021
దుబాయ్:27 ఏళ్ళ సేల్స్ మేన్, తాను పనిచేసిన ఓ వస్త్ర దుకాణాన్ని తగలబెట్టాడు. ఈ క్రమంలో 1 మిలియన్ దిర్హాముల నష్టం వాటిల్లింది. నైఫ్ ప్రాంతంలో ఈ ఘటన చోట చేసుకుంది. వివరాల్లోకి వెళితే, షాపు ఓనర్.. తన వద్ద పనిచేసిన సేల్స్ మేన్ కి జీతం చెల్లించలేదని తేలింది. బాధితుడి రెసిడెన్సీ రద్దవడానికి కూడా షాపు ఓనర్ కారణంగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో బాధితుడు దొంగతనానికి యత్నించాడు. అయితే, షాపులో డబ్బు దొరక్కపోవడంతో, షాపుని తగలబెట్టాడు. లైటర్ సాయంతో షాపులో మంటలు వచ్చేలా చేసి, షట్టర్ మూసివేవాడు. అనంతరం అక్కడి నుంచి పారిపోయాడు. సీసీటీవీ పరిశీలించగా, అసలు విషయం బయటపడిందని షాప్ ఓనర్ పేర్కొన్నారు.
తాజా వార్తలు
- సీజేపీతో ముగిసిన కేంద్రం చర్చలు..
- గ్లోబల్గా చాట్జీపీటీ డౌన్..
- ‘మేక్ ఇన్ ఇండియా’కు వైద్యరంగంలో మరో మైలురాయి
- అమరావతి బ్రాండ్ను ప్రపంచానికి చాటే చెప్పేలా ‘స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026’
- పోలీసుల అరాచకాల పై చర్యలు తీసుకోవాలని అభిజీత్ డిప్కే డిమాండ్
- మహిళ హత్య కేసు.. మరణశిక్షను రద్దు చేసిన యూఏఈ సుప్రీంకోర్టు..!!
- పేపర్ లీకేజీలకు చెక్.. కొత్త బిల్లు డ్రాఫ్ట్ విడుదల చేసిన కేంద్రం
- ఎంబసీ సాయం.. తండ్రి అంత్యక్రియలకు హాజరైన మహిళ..!!
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. పర్యాటక ప్రాంతాల్లో భద్రతా చర్యలు ముమ్మరం..!!
- ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా పై సోనమ్ వాంగ్చుక్ సంచలన పోస్ట్!







