జీతం ఇవ్వలేదని, షాప్ తగలబెట్టిన వ్యక్తి, 1 మిలియన్ దిర్హాముల నష్టం

- April 05, 2021 , by Maagulf
జీతం ఇవ్వలేదని, షాప్ తగలబెట్టిన వ్యక్తి, 1 మిలియన్ దిర్హాముల నష్టం

దుబాయ్:27 ఏళ్ళ సేల్స్ మేన్, తాను పనిచేసిన ఓ వస్త్ర దుకాణాన్ని తగలబెట్టాడు. ఈ క్రమంలో 1 మిలియన్ దిర్హాముల నష్టం వాటిల్లింది. నైఫ్ ప్రాంతంలో ఈ ఘటన చోట చేసుకుంది. వివరాల్లోకి వెళితే, షాపు ఓనర్.. తన వద్ద పనిచేసిన సేల్స్ మేన్ కి జీతం చెల్లించలేదని తేలింది. బాధితుడి రెసిడెన్సీ రద్దవడానికి కూడా షాపు ఓనర్ కారణంగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో బాధితుడు దొంగతనానికి యత్నించాడు. అయితే, షాపులో డబ్బు దొరక్కపోవడంతో, షాపుని తగలబెట్టాడు. లైటర్ సాయంతో షాపులో మంటలు వచ్చేలా చేసి, షట్టర్ మూసివేవాడు. అనంతరం అక్కడి నుంచి పారిపోయాడు. సీసీటీవీ పరిశీలించగా, అసలు విషయం బయటపడిందని షాప్ ఓనర్ పేర్కొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com