భారత్లో కరోనా కేసుల వివరాలు
- April 05, 2021
న్యూ ఢిల్లీ:భారత్లో కరోనా సెకండ్ వేవ్ కల్లోలమే సృష్టిస్తోంది.కరోనా ఫస్ట్ వేవ్ కంటే తీవ్రంగా ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నట్టుగానే పరిస్థితి ఉంది.ఫస్ట్ వేవ్లో కేసులు భారీ సంఖ్యలో నమోదు అయినా.. లక్ష దాటింది లేదు..కానీ, ఆ రికార్డును బ్రేక్ చేసిన సెకండ్ వేవ్... కొత్త రికార్డులను సృష్టిస్తూ.. లక్షకు పైడా పాజిటివ్ కేసులు నమోదు చేసింది.. కేంద్ర ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా కరోనా బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో భారత్లో 1,03,558 కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.కరోనా బారిన పడి 478 మంది మృతిచెందారు.. ఇదే సమయంలో 52,847 మంది పూర్తిస్థాయిలో కోలుకున్నట్టు కేంద్రం ప్రకటించింది.ఇక, మొత్తం కోవిడ్ పాజిటివ్ కేసుల సంఖ్య 1,25,89,067కు చేరుకోగా... ఇప్పటి వరకు 1,16,82,136 మంది కరోనాబారినపడి కోలుకున్నారు.ప్రస్తుతం దేశవ్యాప్తంగా 7,41,830 యాక్టివ్ కేసులు ఉండగా.. ఇప్పటి వరకు కోవిడ్తో మృతిచెందినవారి సంఖ్య 1,65,101కు పెరిగింది.. మరోవైపు.. వ్యాక్సినేషన్ కూడా కొనసాగుతుండగా.. ఇప్పటి వరకు 7,91,05,163 మందికి వ్యాక్సినేషన్ పూర్తి అయినట్టు కేంద్రం పేర్కొంది.
తాజా వార్తలు
- QR14.667 బిలియన్లకు POS, ఇ-కామర్స్ లావాదేవీలు..!!
- ఆప్టామిల్ మిల్క్ పౌడర్ పై SFDA క్లారిటీ..!!
- దక్షిణ ఇరాన్లో భూకంపం..యూఏఈ సేఫ్..!!
- కువైట్ లో వేలానికి 208 వాహనాలు..!!
- ఒమన్ లో తప్పిపోయిన చిన్నారి సురక్షితం..!!
- ప్రభుత్వ పర్యవేక్షణలో ప్రైవేట్ ఆసుపత్రులు..!!
- విదేశీ ప్రయాణాలు చౌక.. TCS 2 శాతానికి తగ్గింపు
- సీఎం రేవంత్ రెడ్డికి అరుదైన అంతర్జాతీయ గుర్తింపు
- లోక్సభలో బడ్జెట్ ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్
- హైదరాబాద్లో మరో కొత్త షాపింగ్ మాల్..







