హాస్పిటల్లో అక్షయ్ కుమార్
- April 05, 2021
బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ కొవిడ్తో హాస్పిటల్లో చేరాడు. ఆదివారం ఉదయం తాను కరోనా బారిన పడినట్లు చెప్పిన అతడు.. డాక్టర్ల సలహా మేరకు ముందు జాగ్రత్తగా ఆసుపత్రిలో చేరినట్లు సోమవారం మరో ట్వీట్ చేశాడు. మీ అభిమానానికి కృతజ్ఞతలు. మీ ప్రార్థనలు పని చేస్తున్నాయి. నేను బాగానే ఉన్నాను. అయితే ముందు జాగ్రత్తగా డాక్టర్ల సలహా మేరకు ఆసుపత్రిలో చేరాను. త్వరలోనే ఇంటికి తిరిగి వస్తానని ఆశిస్తున్నాను అని అక్షయ్ ట్వీట్ చేశాడు.
మరోవైపు అక్షయ్ నటిస్తున్న రామ్సేతు మూవీలో ఏకంగా 45 మంది జూనియర్ ఆర్టిస్టులు కూడా కరోనా బారిన పడ్డారు. ఇప్పటికే ఆమిర్ ఖాన్, ఆలియా భట్, ఫాతిమా సనా షేక్, కార్తీక్ ఆర్యన్, పరేష్ రావల్, మిలింద్ సోమన్లాంటి వాళ్లకు కూడా కరోనా సోకిన విషయం తెలిసిందే. దేశంలో రెండో దశ కరోనా మరింత ఉద్ధృతంగా ఉంది. ఎన్నడూ లేని విధంగా 24 గంటల్లోనే కేసులు లక్ష దాటాయి.
తాజా వార్తలు
- లోక్సభలో బడ్జెట్ ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్
- హైదరాబాద్లో మరో కొత్త షాపింగ్ మాల్..
- ఓల్డ్ గల్ఫ్ ప్లేట్ కార్ల రిజిస్ట్రేషన్ ఫీజు యథాతథం..!!
- యూఏఈలో పెట్ రిజిస్ట్రేషన్ తప్పనిసరి.. Dh1,000 వరకు జరిమానాలు..!!
- కువైట్ లో సైరన్ల టెస్ట్ రన్ టైమ్ లో మార్పులు..!!
- ఖతార్లో ఏడు రెస్టారెంట్లతో సహా 12 ఆహార సంస్థలు మూసివేత..!!
- భారత్-అరబ్ బంధం బలోపేతం..!!
- మస్కట్ నైట్స్: ముగిసి అర్ధా ఒంటెల రేసు..!!
- ఫిబ్రవరి 1 నుంచి అమల్లోకి కొత్త రూల్స్!
- ఏపీలో కొత్తగా ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం..







