హాస్పిటల్లో అక్షయ్ కుమార్
- April 05, 2021బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ కొవిడ్తో హాస్పిటల్లో చేరాడు. ఆదివారం ఉదయం తాను కరోనా బారిన పడినట్లు చెప్పిన అతడు.. డాక్టర్ల సలహా మేరకు ముందు జాగ్రత్తగా ఆసుపత్రిలో చేరినట్లు సోమవారం మరో ట్వీట్ చేశాడు. మీ అభిమానానికి కృతజ్ఞతలు. మీ ప్రార్థనలు పని చేస్తున్నాయి. నేను బాగానే ఉన్నాను. అయితే ముందు జాగ్రత్తగా డాక్టర్ల సలహా మేరకు ఆసుపత్రిలో చేరాను. త్వరలోనే ఇంటికి తిరిగి వస్తానని ఆశిస్తున్నాను అని అక్షయ్ ట్వీట్ చేశాడు.
మరోవైపు అక్షయ్ నటిస్తున్న రామ్సేతు మూవీలో ఏకంగా 45 మంది జూనియర్ ఆర్టిస్టులు కూడా కరోనా బారిన పడ్డారు. ఇప్పటికే ఆమిర్ ఖాన్, ఆలియా భట్, ఫాతిమా సనా షేక్, కార్తీక్ ఆర్యన్, పరేష్ రావల్, మిలింద్ సోమన్లాంటి వాళ్లకు కూడా కరోనా సోకిన విషయం తెలిసిందే. దేశంలో రెండో దశ కరోనా మరింత ఉద్ధృతంగా ఉంది. ఎన్నడూ లేని విధంగా 24 గంటల్లోనే కేసులు లక్ష దాటాయి.
తాజా వార్తలు
- చోరీలకు పాల్పడుతున్న ప్రవాసులు అరెస్ట్
- డ్రగ్స్ కేసులో భారతీయ డీజేకి 25 ఏళ్ల జైలుశిక్ష..తీర్పుపై అప్పీల్
- సౌత్ ఆఫ్రికా: లోయలో పడిన బస్సు.. 45 మంది మృతి
- లోయలో పడిన కారు.. 10 మంది దుర్మరణం
- కాంగ్రెస్కు రూ.1,700 కోట్ల ట్యాక్స్ నోటీసు
- అవగాహన లేకపోతే AI దుర్వినియోగం కావచ్చు : బిల్ గేట్స్తో మోదీ
- FTPC ఇండియా జాతీయ సమన్వయ కమిటీల చైర్మన్ గా గొట్టుపర్తి మధుకర్ (బాబ్జి)
- అల్లు అర్జున్ మైనపు విగ్రహం ఆవిష్కరణ..
- వితంతువులు, అనాథలకు రాయల్ ఈద్ బహుమతులు
- రష్యా విమానాశ్రయంలో ప్రమాదం..ఎమిరేట్స్ విమానం రద్దు